HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Dr Manmohan Singhs Legacy In Telangana Statehood And Development

Manmohan Singh : తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చిన మన్మోహన్

Manmohan Singh : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి (Formation of Telangana) ఆయన కీలక పాత్ర పోషించారు

  • Author : Sudheer Date : 27-12-2024 - 5:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Manmohan Singh Telangana St
Manmohan Singh Telangana St

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) (92) గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మన్మోహన్..గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పటల్ కు తరలించారు. చికిత్స తీసుకుంటూనే రాత్రి కన్నుమూశారు. అంతకు ముందు మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వెంటనే ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియాగాంధీ, వాయనాడ్ ఎంపీ ప్రియాంకగాంధీ హుటాహుటిన ఎయిమ్స్ హాస్పటల్ కు చేరుకోవడం , ప్రధాని నరేంద్రమోదీ.. మన్మోహన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.

ఇక మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు తెలంగాణ ప్రజల (People of Telangana) గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి (Formation of Telangana) ఆయన కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన విషయంలో సున్నితంగా వ్యవహరించి, తెలంగాణ ప్రజల ఆత్మీయ కోరికను నెరవేర్చడంలో ఆయన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల పోరాటం చాలా దశాబ్దాలుగా కొనసాగింది. ఆ పోరాటానికి తుది గమ్యం దిశగా దారి చూపిన నాయకుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. ప్రజాస్వామ్య విలువలకు అడ్డంకి రావడం ఇష్టం లేని మన్మోహన్, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని గౌరవించి, వారి కోరిన స్వప్నాన్ని నిజం చేసారు. రాష్ట్ర విభజన అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఈ విషయంలో ఆంధ్రా ప్రజల నష్టపోకుండా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఆయన సమతుల్యంగా వ్యవహరించారు. విభజన అనంతరం కూడా రెండు ప్రాంతాలకు సమగ్ర అభివృద్ధి కల్పించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకున్నారు.

తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికిన మన్మోహన్

తెలంగాణ ప్రజల పోరాటాన్ని అర్థం చేసుకున్న మన్మోహన్, వారి ఆకాంక్షలను నిజం చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఒత్తిళ్లను అధిగమించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందడంలో ఆయన సహకారం అపారమైంది. ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రజలు ఆయనకు ప్రత్యేకమైన గౌరవం కల్పించారు. తెలంగాణ ఏర్పాటుతో మన్మోహన్ సింగ్ పేరు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

ఇక మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో రాష్ట్ర సాధనకోసం ఎత్తుగడలో భాగంగా నాటి టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ కుదుర్చుకున్న పొత్తు నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వారి క్యాబినెట్ సహచరుడిగా పనిచేసిన గతాన్ని, డాక్టర్ మన్మోహన్ సింగ్ తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ (KCR) స్మరించుకున్నారు.

మిత భాషిగా, అత్యంత సౌమ్యుడుగా, జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా, భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు గొప్పవి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తుచేసుకున్నారు. ప్రధానిగా తెలంగాణ ఏర్పాటు సందర్భంగా వారందించిన మద్దతును, చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని కేసీఆర్ అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read Also : Tripti Dimri : యానిమల్ బ్యూటీతో ప్రేమకథ తీస్తున్నారా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Formation of Telangana
  • kcr
  • Manmohan singh
  • Special Category Status
  • telangana people
  • telangana state

Related News

Minister Konda Surekha and Seethakka meets KCR

మహిళా మంత్రులకు కేసీఆర్‌ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం

మంత్రులు నివాసానికి చేరుకోగానే కేసీఆర్ వారిని చిరునవ్వుతో పలకరిస్తూ “బాగున్నారా అమ్మా” అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. మంత్రుల రాక సందర్భంగా కేసీఆర్ సంప్రదాయ పద్ధతిలో వారికి గౌరవం ఇచ్చారు. పసుపు, కుంకుమ, చీరలు, తాంబూలాలతో వారిని మర్యాదపూర్వకంగా సత్కరించారు.

  • Erravalli Farmhouse Seethakka, Konda Surekha,

    కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

  • kcr rule

    కేసీఆర్ నమ్మించి తెలంగాణ ప్రజలగొంతు కోసాడా ? కవిత వ్యాఖ్యలు వింటే అలాగే అనిపిస్తుంది !!

  • Kavitha Crying

    కవిత కన్నీరు, బిఆర్ఎస్ ను మరింత పతనం చేయబోతుందా ?

  • Palamuru Rangareddy Project

    పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సిట్ విచారణ ?

Latest News

  • హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్..

  • ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టినట్లే!

  • త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అంటూ క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు

  • ‘రాజాసాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్

  • భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ధర ఎంతకి చేరిందంటే..

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd