Telangana: డబుల్ బెడ్ రూమ్ హామీని విస్మరించిన కేసీఆర్: డీకే అరుణ
తెలంగాణ ప్రజలకు సీఎం కెసిఆర్ ఇచ్చిన హమీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆమె పాల్గొని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు
- By Praveen Aluthuru Published Date - 07:05 AM, Tue - 25 July 23
Telangana: తెలంగాణ ప్రజలకు సీఎం కెసిఆర్ ఇచ్చిన హమీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆమె పాల్గొని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
♦️రాష్ట్రవ్యాప్తంగా సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని మాయ మాటలు చెప్పిన కేసీఆర్ 9 సంవత్సరాలు గడిచిన ఇంతవరకు దరఖాస్తు చేసుకున్న వారిలో కనీసం 5 శాతం మందికి కూడా లబ్ధి చేకూర్చలేదని అన్నారు.
♦️ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తరువాత డబుల్ బెడ్ రూమ్ హామీని విస్మరించడమే కాక , ఖాళీ స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5లక్షలు ఇస్తామని అవి కూడ ఇవ్వలేదని ఆరోపించారు డీకే అరుణ. .
♦️పిఎం ఏ వై అర్బన్ ద్వారా సుమారు 4700 కోట్లు 2.5 లక్షల ఇళ్లను మరియు పి ఎం ఏ వై రూరల్ ద్వారా 196 కోట్లు 70000 ఇండ్లను మొదటి విడుతగా శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేటాయిస్తే డబుల్ బెడ్ రూమ్ పేరుతో వాటిని కూడా పేదలకు అందకుండా చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
♦️కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో కొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించిన బిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కమిషన్ల కక్కుర్తితో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అత్యంత నాసిరకంగా, ఎలాంటి మౌలిక వసతులు లేకుండా నిర్మించింది. కనీసం ఆ ఇండ్లను కూడా లబ్ధిదారులకు అందించడం లేదు. ఇచ్చిన కొన్ని చోట్ల కూడా బిఆర్ఎస్ కార్యకర్తలకు అక్రమంగా కేటాయిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
♦️కేంద్ర ప్రభుత్వానికి లబ్ధిదారుల జాబితాను అందిస్తే సంవత్సరానికి 1,00,000 ఇండ్లను మంజూరు చేసే అవకాశం ఉండి కూడా కేసీఆర్ సర్కార్ పూర్తిగా నిష్క్రియాతత్వంగా ఉండిపోతుందని తెలిపారు. .
♦️ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పును ఒప్పుకుని తను ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కృషి చేయాలి. దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత ఆధారంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలి లేకుంటే బిజెపి ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు డీకే అరుణ.
Also Read: Walking after the meal: భోజనం తర్వాత 10 నిమిషాల నడక వల్ల కలిగే లాభాలు ఎన్నో?
Related News
Mahabubnagar : పదవులకు డీకే అరుణ ముందు…అభివృద్ధికి వెనుక – సీఎం రేవంత్ రెడ్డి
డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు