Telangana IAS Controversy: ఢిల్లీ హైకోర్టుకు `మేఘా-రజత్ `బిల్లుల లొల్లి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మేఘా కంపెనీ వ్యవహారం ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లింది. తెలంగాణ నీటి పారుదలశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ కుమార్తె వివాహం జరపడానికి ఆ కంపెనీ చేసిన ఖరీదైన ఏర్పాట్లపై దాఖలైన ఫిర్యాదుపై విచారణకు ఉపక్రమించింది.
- By CS Rao Published Date - 04:05 PM, Tue - 13 September 22

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మేఘా కంపెనీ వ్యవహారం ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లింది. తెలంగాణ నీటి పారుదలశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ కుమార్తె వివాహం జరపడానికి ఆ కంపెనీ చేసిన ఖరీదైన ఏర్పాట్లపై దాఖలైన ఫిర్యాదుపై విచారణకు ఉపక్రమించింది. ఆ ఫిర్యాదును తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు పంపడానికి సిబ్బంది మరియు శిక్షణ విభాగం (డిఓపిటి) దృష్టికి ఢిల్లీ హైకోర్టు తీసుకువెళ్లింది. కోర్టు కేసును అక్టోబర్ 12కి వాయిదా వేసింది.
రజత్పై సుప్రీంకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ చేసిన ఫిర్యాదును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంపై పిటిషనర్ జి. శ్రీనివాస్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రజత్ కుమార్ అవినీతికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలపై ప్రాసిక్యూషన్ను మంజూరు చేసేలా డిఓపిటిని ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది మోహిత్ జాఖర్ తెలిపిన వివరాల ప్రకారం, రజత్ కుమార్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారని కోర్టుకు తెలియగానే, ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారిపై చేసిన ఫిర్యాదును కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిందా? అని జస్టిస్ వర్మ డిఓపిటి న్యాయవాదిని అడిగారు. అతను ప్రక్రియను తెలుసుకోవాలని కోరాడు, కానీ DoPT న్యాయవాది ప్రత్యుత్తరం దాఖలు చేయడానికి సమయం కోరారు.
పిటిషన్లో, వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును ప్రస్తావించారు.అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిపై ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం అనుమతి ఇవ్వాలని పిటిషనర్ వాదించారు. ఈ ఏడాది జనవరి 28న శ్రవణ్ డిఓపిటికి ఫిర్యాదు చేశాడని తెలుస్తోంది. అండర్ సెక్రటరీ రూపేష్ కుమార్ మార్చి 2న “తగిన చర్య కోసం” సిఎస్కి ఫార్వార్డ్ చేసాడు. ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డీవోపీటీ కోరనుంది.
రజత్ కుమార్ తన కుమార్తెకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారని, హైదరాబాద్లోని ఫైవ్ స్టార్ హోటళ్లలో డిన్నర్ పార్టీలు నిర్వహించారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే, పెద్ద ఎత్తున నీటిపారుదల మరియు పైప్లైన్ ప్రాజెక్టులను అమలు చేయడంలో ప్రసిద్ధి చెందిన అగ్రశ్రేణి ఇన్ఫ్రా కంపెనీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్న కంపెనీలు బిల్లులు చెల్లించాయి. ఆ విషయాన్ని ఆధారాలతో సహా పిటిషనర్ కోర్టుకు అందచేయడంతో విచారణకు ఉపక్రమించింది.
Tags
- delhi high court
- G. Srinivas
- Infra company
- petitioner
- Telangana Irrigation special chief secretary Rajat Kumar

Related News

Jacqueline Fernandez: ఢిల్లీ కోర్టుకు హాజరైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ రోజు ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. ఆమె రూ. 200 కోట్ల మనీలాండరింగ్ జరిపినట్టు ఆరోపణల నేపథ్యంలో ఆమెపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు