Munugode : టిక్కెట్ ఇవ్వకపోతే జంప్?
కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తోన్న పాల్వాయి స్రవంతిరెడ్డి మునుగోడు నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడారు. ఈసారి ఆమెకు టిక్కెట్ లభించకపోతే స్రవంతిపై టీఆర్ఎస్, బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేర్వేరుగా చేసే అవకాశం ఉంది.
- By Hashtag U Published Date - 03:00 PM, Fri - 26 August 22
కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తోన్న పాల్వాయి స్రవంతిరెడ్డి మునుగోడు నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడారు. ఈసారి ఆమెకు టిక్కెట్ లభించకపోతే స్రవంతిపై టీఆర్ఎస్, బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేర్వేరుగా చేసే అవకాశం ఉంది. ఆ మేరకు టాక్ రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటీవల ఆమెను బుజ్జగించారు. అంతేకాదు, సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వేలోనూ స్రవంతికి సానుకూలంగా ఉందట. అందుకే ఆమెకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని కాంగ్రెస్ అధిష్టానంకు సూచించారట. ఆమెతో పాటు చలమల క్రిష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని సునీల్ సర్వేల ద్వారా తేల్చారని తెలుస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరికి టిక్కెట్ ఫైనల్ కానుంది.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, కృష్నారెడ్డి పేర్లను టీపీసీసీ సిఫారస్సు చేసింది.గాంధీభవన్లో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మాణికం ఠాగూర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీనియర్ నేతలంతా హాజరై కాంగ్రెస్ అభ్యర్థిగా స్రవంతి లేదా కృష్ణా రెడ్డిని నిలబెట్టాలని సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు వాళ్లిద్దరి పేర్లను ఢిల్లీ అధిష్టానంకు పంపారు. అక్కడి నుంచి వచ్చే సీల్డ్ కవర్ ఓపెన్ చేస్తేగానీ ఎవరనేది తేలదు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని తమ అభ్యర్థిగా బరిలోకి దించాలని బీజేపీ ఇప్పటికే సూచించగా, మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు గుర్రం కోసం అధికార టీఆర్ఎస్ తంటాలు పడుతోంది. స్రవంతి పోటీలో ఉంటే కాంగ్రెస్ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని సర్వే స్పష్టంగా సూచించడంతో ఉపఎన్నికల్లో మహిళా అభ్యర్థిని నిలబెట్టేందుకు ఆ పార్టీ నేతలు మొగ్గు చూపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇటీవల ఆ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్కు ఎదురవుతున్న సవాళ్లను రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్రెడ్డి పార్టీ ఇన్చార్జి, ఇతర సీనియర్ నేతలకు వివరించారు.
“క్యాడర్ మరియు నాయకత్వంలో నైతిక స్థైర్యాన్ని పెంచడానికి మరియు 2023 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటానికి ఉపఎన్నికలో పార్టీ విజయం తప్పనిసరిజ. ఆ సీటును నిలుపుకోవడానికి కాంగ్రెస్ జాగ్రత్తగా కదులుతోంది. మీడియా ప్రతినిధులతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అభ్యర్థిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన వెంటనే ప్రచారానికి వెళ్లి పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేస్తామన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రేస్ లో స్రవంతి, కృష్ణారెడ్డి మాత్రమే మిగిలారు. బీసీ నేతలు అంతా వెనుకబడిపోయారు.
Tags
Related News
Jagga Reddy : దమ్ములేని అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టింది : జగ్గారెడ్డి
Jagga Reddy : ఈ లోక్సభ ఎన్నికల్లో దమ్ములేని అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.