HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Fighting Over Factional Clashes In Congress Party Again

T-Congress: కామారెడ్డి కాంగ్రెస్ లో కుమ్ములాటలు!

ఒకవైపు చేరికలతో టీకాంగ్రెస్ దూసుకుపోతుంటే.. మరోవైపు చాపకింద నీరులా అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి.

  • Author : Balu J Date : 25-06-2022 - 11:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tcongress
Tcongress

ఒకవైపు చేరికలతో టీకాంగ్రెస్ దూసుకుపోతుంటే.. మరోవైపు చాపకింద నీరులా అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో వర్గపోరు తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మళ్లీ బట్టబయలైంది. రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మదన్ మోహన్, సుభాష్ రెడ్డిల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మళ్లీ రాజుకుంది. రాజంపేట మండలం ఎల్లారెడ్డి పల్లి తండా వివాదస్పదంగా మారింది. మరోసారి ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుభాష్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదిన మోహన్ రావు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఇటీవల కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్ పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నారని ఆరోపిస్తూ మదన్ మోహన్ రావును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మదన్ మోహన్ రావుపై పీసీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మడైన్ మోహన్ వర్గీయులు రచ్చ బండ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ చార్జి సుభాష్ రెడ్డి వర్గీయులు అక్కడికి రావడంతో ఘర్షణ మొదలైంది. దీంతో సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ పరస్పరం దాడి చేసుకున్నారు. కర్రలతో కొట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘర్షణలో గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గతంలో ఎల్లారెడ్డిలో జరిగిన సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎదుటే సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు వాగ్వాదానికి దిగారు. ఒక వర్గం వారు మరో వర్గం ఫ్లెక్సీలను చించివేశారు. మదన్ మోహన్ రావు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జహీరాబాద్ ఎంపీగా పోటీ చేశారు. మదన్ మోహన్ రావు స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంపై మదన్ మోహైన్ రావు కన్నేశారు. గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జాజుల సురేందర్ పోటీ చేసి గెలుపొందారు. అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంపై సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు కన్నేశారు. వీరిద్దరూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. అది ఇరువైపులా మింగుడుపడదు. కామారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, పార్టీ సీనియర్‌ నాయకులు షబ్బీర్‌ అలీ కూడా పార్టీ నేతలకు సమాచారం ఇవ్వకుండా సొంతంగా మదన్‌మోహన్‌రావు చేస్తున్న కార్యకలాపాలపై మండిపడుతున్నట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి పోటీచేస్తానని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న ధరలతో పేదల మీద భారం పెరుగుతోందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించుతామని అజారుద్దీన్‌ స్పష్టం చేశారు. కామారెడ్డి నుంచే అజారుద్దీన్ పోటీ చేస్తానని స్పష్టం చేయడంతో ఆయన వ్యతిరేక వర్గానికి మింగుడుపడటం లేదు. ఎన్నికలకు ముందే కామారెడ్డి కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక  కామారెడ్డి వర్గపోరు రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం కలుగజేసుకొని పార్టీ నాయకులకు సర్దిచెప్పాలని కిందిస్థాయి కార్యకర్తలు కోరుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • clashes
  • congress
  • kamareddy
  • revanth reddy

Related News

Congress ranks call for movement in wake of National Herald case

నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

ఈ కేసును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుగా ఉపయోగించిందని కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా వేధింపులకు పాల్పడ్డారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

  • Changes in Congress's action on National Employment Guarantee.

    జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

  • Telangana Speaker G Prasad Kumar

    తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

  • Lok Sabha

    లోక్‌స‌భ‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!

Latest News

  • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర

  • తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

  • భారత్ vs సౌతాఫ్రికా ఈ సిరీస్‌ చివరి టీ20!

  • కవిత దూకుడు, బిఆర్ఎస్ శ్రేణుల్లో చెమటలు

  • విటమిన్​ బి12 లోపం లక్షణాలు ఇవే!

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd