Bhoiguda: సికింద్రాబాద్ బాధిత కుటుంబాలకు పరిహారం!
సికింద్రాబాద్ బోయగూడలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.
- By Balu J Published Date - 06:06 PM, Wed - 23 March 22
సికింద్రాబాద్ బోయగూడలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. కాగా అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించినవారికి ఒక్కొక్కరికీ రూ 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
Chief Minister Sri K. Chandrashekar Rao has expressed shock over the fire accident at a Scrap Godown in Bhoiguda, Secunderabad. Hon'ble CM mourned the death of Bihar migrant workers in the mishap and announced an ex-gratia of Rs. 5 lakh each to the families of the deceased.
— Telangana CMO (@TelanganaCMO) March 23, 2022
దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఆయా కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. మరోవైపు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాదంలో వలస కార్మికుల సజీవ దహనం బాధాకరమని అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఉపాధి కోసం బీహార్ నుంచి వలస వచ్చిన కూలీలు ఈ దుర్ఘటనలో మృత్యువాత పడటం అత్యంత దురదృష్టకరమంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
Pained by the loss of lives due to a tragic fire in Bhoiguda, Hyderabad. My thoughts are with the bereaved families in this hour of grief. An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 23, 2022
Related News
PM Modi : ప్రధాని మోడీ ప్రసంగాలపై పిటిషన్ల్..తొసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
Lok Sabha elections: ప్రధాని మోడీ(PM Modi) లోక్సభ ఎన్నికల్లో మతపరమైన విభజన ప్రసంగాలు(Religious divisive speeches) చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘీంచారని, ఆయనపై చర్యలకు ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్(petitions)ను ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi) సోమవారం రోజు తోసిపుచ్చింది. పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని, విచారణకు అర్హమైనది కాదని జస్టిస్ సచిన్ దత్తా తీర్పునిచ్చారు. We’re now on WhatsApp. Click