CM Revanth: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు.. తెలంగాణ అభివృద్ధి సాధించాలంటూ ఆకాంక్ష
- By Balu J Published Date - 06:23 PM, Mon - 8 April 24
CM Revanth: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు.
నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
ఇక ఉగాది పండుగను ప్రతి సంవత్సరం మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. అంతేకాకుండా ఈరోజు పంచాంగం లో భాగంగా కొత్త సంవత్సరంలో గ్రహాల స్థితులు రాశి ఫలాలు కూడా తెలుసుకుంటారు. అలాగే ఉగాది రోజున హిందువులంతా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పిండివంటలతో పాటు ఉగాది పచ్చడిని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పండుగనే కొత్త సంవత్సరంగా భావిస్తారు. తాము ప్రారంభించాలనుకున్న పనిని ఉగాది పర్వదినం రోజున సెంటిమెంట్ గా భావించి కార్యరంగంలోకి దిగుతారు.
Also Read: 6 Thousand Pension : దివ్యాంగులకు రూ.6 వేల పింఛను – చంద్రబాబు ప్రకటన
Related News
Errabelli: కాంగ్రెస్ పార్టీని మరోసారి నమ్మొద్దు : మాజీ మంత్రి ఎర్రబెల్లి
Errabelli: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పెద్దపెద్ద వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టింది’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ ఎస్ వరంగల్ లోక్ సభ అభ్యర్థి ఎం.సుధీర్ కుమార్ కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.ప్రజల భవిష్యత్ లో మార్పు తీసుకొస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏమీ చేయకుండా చేతులెత్తేసిందన్నారు. విద్యుత్ అ