CM Revanth Reddy : సీఎం కూతురి పెద్ద మనసు.. ఐపీఎల్ స్టేడియంలో అనాథ పిల్లలు.!
ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనాథలను స్టేడియానికి తీసుకెళ్లింది సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె నిమిషా రెడ్డి.
- By Kavya Krishna Published Date - 08:45 PM, Thu - 9 May 24
సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన ప్రజల అభివృద్ధి కోసం అహర్నిషలు కష్టపడే నాయకుల్లో ముందుంటారు. అయితే.. ఆయన తన వ్యక్తిత్వాన్ని తన కుటుంబానికి కూడా అందించారు. అందుకు నిదర్శనమే ఈ ఘటన. ఇతరులకు సహాయం చేయడం దైవికమైన విషయం. అయితే.. మంచి స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేసే స్వభావం ఉండదు. ఇతరులకు సహాయం చేయడం మొత్తం ప్రపంచాన్ని మార్చకపోవచ్చు. కానీ సహాయం పొందిన వారికి ఇది పెద్ద మార్పును తీసుకురాగలదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమార్తె 30 మంది అనాథల పిల్లలకు సంతోషం కలిగించి పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే.. నిన్న ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో లక్నో తలపడిన విషయం తెలిసిందే. అయితే.. క్రికెట్ అంటే ఎంతో ఇష్టమున్న అనాథ బాలలకు ప్రత్యక్షంగా ఈ మ్యాచ్ చూసేందుకు ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అయితే.. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనాథలను స్టేడియానికి తీసుకెళ్లింది సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె నిమిషా రెడ్డి. క్రికెటర్లను దగ్గరి నుంచి చూడడం పట్ల వారు చాలా సంతోషించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. నిమిషా రెడ్డి ఒక అనాథాశ్రమం నుండి 30 మంది పిల్లలను మ్యాచ్కు తీసుకెళ్లింది. వారు SRH జెండాలను పట్టుకుని ఉన్న చిత్రానికి పోజులిచ్చారు, వారి ముఖాల్లో ప్రకాశవంతమైన చిరునవ్వును మనం చూడవచ్చు. ముఖ్యమంత్రి కూతురు అన్నీ చూసుకుని సౌకర్యాలు కల్పించారు. సేఫ్ ఛారిటబుల్ ఫౌండేషన్లోని చిన్నారులను స్టేడియానికి తీసుకెళ్లడం వారికి చిరస్మరణీయమైన రోజు. అంతే కాదు, మ్యాచ్ కోసం ప్రీమియం బాక్స్ టిక్కెట్లను వారికి అందించినట్లు చెబుతున్నారు. ఒకటి.. పిల్లలు హాయిగా స్టేడియం నుంచి మ్యాచ్ను ఆస్వాదించగా, రెండో విషయం ఏమిటంటే.. ఆతిథ్య జట్టును ఉత్సాహపరిచారు. ఈ మ్యాచ్లో SRH భారీ విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్లో ఓపెనర్లు బీస్ట్ మోడ్లో ఉన్నారు మరియు వారు వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించారు.
Read Also : Chiranjeevi : మే 10న చంద్రబాబును చిరంజీవి కలవనున్నారా?
Related News
TS : నేడు తెలంగాణ కేబినెట్ భేటి..షరతులతో ఈసీ అనుమతి
Telangana Cabinet Meeting: ఈరోజు మధ్యహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం సచివాలయంలో జరగనుంది. అయితే మంత్రి మండలి సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలిని ఈసీ ఆదేశించింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణ మాఫీ అంశాలను ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాలని ఆదేశించింది. We’re now on WhatsApp. Click to Join. అంతేకా�