HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Complains To The Center About Aps Behavior

Krishna Water : ఏపీ తీరుపై కేంద్రానికి సీఎం రేవంత్ ఫిర్యాదు

Krishna Water : ఆంధ్రప్రదేశ్ (AP) కేటాయించిన వాటా కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తున్నదని ఆరోపిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు

  • Author : Sudheer Date : 18-02-2025 - 1:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Krishna Water Controversy I
Krishna Water Controversy I

కృష్ణ వాటర్ (Krishna Water) విషయంలో ఏపీ వ్యవహరిస్తున్న తీరు పై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ (AP) కేటాయించిన వాటా కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తున్నదని ఆరోపిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు సీఎం. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఏపీ అధిక నీటిని తరలిస్తోందని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టెలిమెట్రీ వ్యవస్థను అమలు చేయడం తప్ప మరో మార్గం లేదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టెలిమెట్రీ వ్యవస్థ ద్వారా కృష్ణా నదిలో నీటి ప్రవాహాన్ని కచ్చితంగా లెక్కించుకోవచ్చు. అయితే టెలిమెట్రీ వ్యవస్థ కోసం అవసరమైన నిధుల విషయంలో ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని అధికారుల ద్వారా సీఎం గమనించారు. ఈ వ్యవస్థను అమలు చేయడానికి తెలంగాణ తన వాటా మొత్తం చెల్లిస్తుందని, కేంద్ర జల కమిషన్ దీనిపై జోక్యం చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.

MGNREGA Workers : ఏపీలో ఉపాధి హామీ కూలీలకు శుభవార్త

రాబోయే వేసవి కాలంలో నీటి సమస్య తలెత్తకుండా రాష్ట్రంలోని ప్రాజెక్టుల నుంచి నీటిని సమర్థంగా విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వేసవిలో తీవ్రమైన వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రైతులకు సాగునీరు నిరంతరాయంగా అందించేందుకు ప్రాజెక్టుల నీటి నిల్వలు గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అలాగే తాగునీరు, సాగునీరు అవసరాలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. అంతకు ముందు కృష్ణా నీటి వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి అనుమతి ఇచ్చినట్టుగా తెలంగాణ ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. గత మూడు నెలలుగా ఏపీ రోజుకు 10,000 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ నుంచి తీసుకుంటోందని, ఇప్పటి వరకు 646 టీఎంసీల నీటిని వినియోగించుకుందని కేటీఆర్ వివరించారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి స్పందించకపోవడం శోచనీయమని ఆయన విమర్శించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • cm revanth
  • Krishna Water
  • Krishna Water Controversy
  • KWDT-II
  • telangana
  • uttam

Related News

Earthquake In Ap

Earthquake in AP : ఏపీలో భూకంపం

ఈ భూకంపం వల్ల వినుకొండతో పాటు ప్రకాశం జిల్లాలోని దర్శి మరియు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా మంచాలు, ఇంట్లోని వస్తువులు కదలడంతో ఉలిక్కిపడి లేచారు. కొన్నిచోట్ల పాత్రలు కింద పడటం,

  • Good News To Women

    Good News : మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

Latest News

  • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

  • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

  • సాక్షి మీడియాకు వైఎస్ భారతికి డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు

  • ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు..త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌

  • బిల్డర్లకు ఏపీ ప్రభుత్వం భారీ ఊరట..100% పన్ను కట్టక్కర్లేదు !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd