Old City Metro: పాతబస్తీ మెట్రోపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
పాతబస్తీ మెట్రోపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. గత కొంతకాలంగా పాతబస్తీ మెట్రో అంశం నలుగుతూ వస్తుంది.
- By Praveen Aluthuru Published Date - 07:01 AM, Tue - 11 July 23
![Old City Metro: పాతబస్తీ మెట్రోపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/07/new-web-story-copy-2023-07-11T070121.125.jpg)
Old City Metro: పాతబస్తీ మెట్రోపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. గత కొంతకాలంగా పాతబస్తీ మెట్రో అంశం నలుగుతూ వస్తుంది. హైదరాబాద్ లోని అన్ని ప్రధాన ఏరియాలకు మెట్రో పరుగులు పెడుతుంది. అయితే హైదరాబాద్ లోని పాతబస్తీకి మాత్రం ఆ మోక్షం ఇంకా లభించలేదు. అయితే తాజాగా ఈ అంశంపై సీఎం కేసీఆర్ పాతబస్తీ మెట్రోకు సంబంధించి మున్సిపల్ డిపార్ట్మెంట్ ని ఆదేశించారు. ఓల్డ్ సిటీకి మెట్రో ఏర్పాటుపై పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ మరియు ఎల్అండ్టీ చైర్మన్ను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్లో తెలిపారు. పాతబస్తీ మెట్రో ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్ ఆ రెండు డిపార్మెంట్లను ఆదేశించారు.
Hon’ble CM KCR has instructed the Municipal Administration department to take forward the Metro project in Old city of Hyderabad
He also spoke to Chairman of L&T which is the agency executing the Metro Rail Project to expeditiously take up the project and promised all needed…
— KTR (@KTRBRS) July 10, 2023
పాతబస్తీ మెట్రోపై కేటీఆర్ చేసిన ట్వీట్ కి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఒవైసీ స్పందించారు. ఓల్డ్ సిటీ ప్రజలు మెట్రో కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని ఒవైసీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇది ఖచ్చితంగా ఓల్డ్ సిటీ ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని, మీరు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను ఒవైసి అన్నారు.
Welcome this announcement by @KTRBRS. The people of Hyderabad’s Old City have been waiting for public transport connectivity for a long time. This will definitely help people of Old City & also bring in more tourism. https://t.co/BK3Cr6WwNX
— Asaduddin Owaisi (@asadowaisi) July 10, 2023
2023-24 రాష్ట్ర బడ్జెట్లో పాతబస్తీకి మెట్రో రైలు సేవలను పొడిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా పటాన్చెరు, కందకూరు వరకు మెట్రోను పొడిగిస్తామని కేసీఆర్హా గత నెలలో మీ ఇచ్చారు. ఇక తాజాగా పాతబస్తీ మెట్రో పనులను వేగవంతం చేయాలనీ తీసుకున్న నిర్ణయంపై అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
Read More: OPPO Phones : ఒప్పో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఒప్పో రెనో 10 5G
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![50 Years of Emergency: 50 ఏళ్ల ఎమర్జెన్సీని పురస్కరించుకుని తెలంగాణ బీజేపీ బ్లాక్ డేగా పాటించింది](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/black-day_11zon.jpg)
50 Years of Emergency: 50 ఏళ్ల ఎమర్జెన్సీని పురస్కరించుకుని తెలంగాణ బీజేపీ బ్లాక్ డేగా పాటించింది
1975 జూన్ 15న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ మంగళవారం 'బ్లాక్ డే'గా నిర్వహించింది.