CM KCR’s Campaign Vehicle : గులాబీ బాస్ ప్రచారం రథం సిద్ధం..
ఈ రథం ఫై కేసీఆర్ చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది
- By Sudheer Published Date - 11:16 AM, Sun - 15 October 23
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్ మిగతా పార్టీల కంటే దూకుడు గా ఉంది. అందరి కంటే ముందే అభ్యర్థుల ప్రకటించడమే కాదు..ఎన్నికల నోటిఫికేషన్ కు ఇంకో 18 రోజులు ఉండగా..ఈరోజే అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేస్తున్నారు గులాబీ బాస్ (BRS president and CM KCR ). మరికాసేపట్లో తెలంగాణ భవన్లో మ్యానిఫెస్టోను విడుదలతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థులందరికీ సీఎం కేసీఆర్ బీ-ఫారాలు అందజేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మొత్తం 119 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులకు ఒకేసారి బీ-ఫారాలు ఇవ్వనున్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్బాబు అధ్యక్షతన జరిగే పార్టీ ఎన్నికల సభకు సీఎం కేసీఆర్ బయల్దేరి వెళ్తారు. ఇదిలా ఉంటె కేసీఆర్ ఎన్నికల ప్రచార రథాన్ని సిద్ధం (CM KCR’s campaign vehicle ready) చేసారు.
ఈ రథం ఫై కేసీఆర్ చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపు (Car symbol, and a map of India, all in vibrant pink, the party’s ‘official’ colour)తో సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గిఫ్ట్ గా ఇచ్చారు. గత కొద్ది రోజుల క్రితం యూపీ నుంచి తెలంగాణాకు ఈ ప్రచార రథం చేరుకుంది. నేటి (ఆదివారం) నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణా రోడ్లపై ఈ ప్రచార రథం పరుగులు పెడుతుంది. ఈరోజు హుస్నాబాదు లో జరగబోయే సభకు కేసీఆర్ ఈ ప్రచార రథంతో చేరుకుంటారని తెలుస్తుంది.
Read Also : T Congress First List : కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో పొంగులేటి, తుమ్మలకు నో ఛాన్స్..
Related News
KTR: డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ ను శిక్షించాలా? వద్దా? : కేటీఆర్
KTR: వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు లో జరిగిన సన్నాహాక సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ కార్యక్రమాలు చేసినా మనం పట్టించుకోలేదు. ప్రభుత్వం లో ఉండి ఐదునెలల్లో రేవంత్ రెడ్డి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అయినప్పటికీ సిగ్గు లేకు�