BRS Party Fund: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఒక్కొక్కరికి 40 లక్షల చెక్కులు
ఎన్నికలో ఖర్చులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చెక్కు అందించింది. అభ్యర్థులకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీ ఫారాలు అందజేసే సమయంలో సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ అభ్యర్థులకు చెక్కులను అందించినట్లు తెలుస్తుంది.
- By Praveen Aluthuru Published Date - 05:02 PM, Wed - 8 November 23
BRS Party Fund: ఎన్నికలో ఖర్చులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చెక్కు అందించింది. అభ్యర్థులకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీ ఫారాలు అందజేసే సమయంలో సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ అభ్యర్థులకు చెక్కులను అందించినట్లు తెలుస్తుంది. విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో 119 అభ్యర్థులకు గానూ మొత్తం అధికారిక మొత్తం రూ.47.60 కోట్లు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల అభ్యర్థులు మాత్రం ఎన్నికలకు అయ్యే ఖర్చులను వారే భరిస్తున్నట్టు సమాచారం.
దేశంలో అసెంబ్లీ మరియు లోక్సభకు ఎన్నికలను నిర్వహించే చట్టబద్ధమైన అధికార సంస్థ అయిన భారత ఎన్నికల సంఘం గత ఏడాది అభ్యర్థుల ఖర్చుల పరిమితిని పెంచింది.అసెంబ్లీ నియోజకవర్గాలకు, పెద్ద రాష్ట్రాల్లో వ్యయ పరిమితి రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు, చిన్న రాష్ట్రాల్లో రూ.20 లక్షల నుంచి రూ.28 లక్షలకు పెంచారు. పార్లమెంటరీ ఎన్నికల ఖర్చుపై పెద్ద రాష్ట్రాల్లో రూ.70 లక్షల నుంచి రూ.95 లక్షలకు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచారు.
Also Read: Telangana: కేసీఆర్ హెలికాఫ్టర్ కు మరోసారి సాంకేతిక లోపం
Related News
Lok Sabha Polls 2024: తమిళిసై మత ప్రచారం.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేయడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళిసై పై బీఆర్ఎస్ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసింది.