Rajiv Yuva Vikasam Scheme : మళ్లీ సిబిల్ స్కోర్ రూల్
Rajiv Yuva Vikasam Scheme : రుణాలు మంజూరు కావడానికి సిబిల్ స్కోర్ (Cibil Score) 700 పైగా ఉండాలి అనే నిబంధన విధించడం యువతలో ఆందోళన కలిగిస్తోంది
- By Sudheer Published Date - 10:02 AM, Sat - 17 May 25

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ‘రాజీవ్ యువ వికాసం’ (Rajiv Yuva Vikasam Scheme) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రూ. 50,000 నుండి రూ. 4 లక్షల వరకు రాయితీ రుణాలు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు దరఖాస్తు చేశారు. ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాలోనే 40,270 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం అధికారుల ద్వారా అర్హుల ఎంపిక, పత్రాల పరిశీలన జరుగుతోంది.
Harihara Veeramallu : ‘హరిహర వీరమల్లు’ నుంచి మూడో పాట వచ్చేస్తుందోచ్ !!
అయితే రుణాలు మంజూరు కావడానికి సిబిల్ స్కోర్ (Cibil Score) 700 పైగా ఉండాలి అనే నిబంధన విధించడం యువతలో ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది పేద కుటుంబాల యువతకు ఇంత ఉన్నతమైన స్కోర్ ఉండకపోవచ్చు. బ్యాంకు లావాదేవీలు, గత రుణాల చెల్లింపుల ఆధారంగా బ్యాంకర్లు అభ్యర్థుల సిబిల్ స్కోర్ను పాన్ కార్డు ద్వారా సేకరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మౌఖిక పరీక్షల వంటివాటికి ఆసక్తి చూపడం లేదు.
ఈ పథకంలో తీసుకునే రుణంపై రాయితీ శాతాలు కూడా తేడాగా ఉన్నాయి. ఉదాహరణకు రూ. 50,000 వరకు అయితే 100% రాయితీ ఉంటుంది. రూ. 50,001 – రూ. 1,00,000 వరకు 90%, రూ. 1,00,001 – రూ. 2,00,000 వరకు 80%, రూ. 2,00,001 – రూ. 4,00,000 వరకు 70% రాయితీ ఉంటుంది. కానీ దరఖాస్తుదారుల్లో 80% మంది రూ. 4 లక్షల రుణం కోరడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. మొదటిసారి రుణం తీసుకునే వారికి, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే దివ్యాంగులకు 5%, మహిళలకు 25% యూనిట్లు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.