HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Centers Key Decision On Sagar And Srisailam Projects Ordered To Be Handed Over To Krishna Board

Sagar-Srisailam: సాగ‌ర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం, కృష్ణా బోర్డుకు అప్ప‌గించాల‌ని ఆదేశం

  • By Balu J Published Date - 12:10 PM, Thu - 18 January 24
  • daily-hunt
Nagarjuna Sagar Imresizer
Nagarjuna Sagar Imresizer

Sagar-Srisailam: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రాజెక్టులు అన‌గానే నాగార్జున సాగ‌ర్, శ్రీశైలం గుర్తుకువ‌స్తాయి. ద‌శాబ్దలుగా ఎంతోమంది ఆయ‌క‌ట్టు రైతుల‌కు నీరందిస్తూ సాగుకు వ‌రంగా మారుతున్నాయి. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఈ రెండు ప్రాజెక్టుల‌కు తెలుగు రాష్ట్రాల‌కు రెండు క‌ళ్ల లాంటివి. అయితే తాజాగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు భద్రత సహా కార్యకలాపాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB)కు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్ లో సాగర్‌ వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముఖర్జీ ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీ ప్రభుత్వ చేతుల్లో ఉందని ముఖర్జీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన దేబశ్రీ ముఖర్జీ నాగార్జున సాగర్ వ్యవహారంపై మాత్రమే మాట్లాడాలని కోరారు. అయితే కేఆర్ఎంబీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్గతంగా చర్చించుకుని చెప్తామని కేంద్ర అధికారులకు తెలిపారు. విద్యుత్తు ప్రాజెక్టులు సహా… ప్రాజెక్టు పరిధిలో ఉన్న అవుట్‌లెట్స్‌, సాంకేతిక పరిమితులు వంటి విషయాలపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు.

టెక్నికల్ ఇష్యూస్ పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకోవాలని జలశక్తి కార్యదర్శి సూచించారు. సాగర్ పరిధిలో సీఆర్పీఎఫ్ భద్రతను కొనసాగించడంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎంల భేటీ సారాంశ నివేదిక పంపిన తరువాత మరో సారి సమావేశం ఉంటుందని ముఖర్జీ తెలిపారు. ఈ భేటీలో ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌, సాధ్య‌సాధాల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central govt
  • Nagarjuna sagar
  • srisailam dam

Related News

    Latest News

    • Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

    • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

    • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

    • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd