Munugodu Elections : మునుగోడులో `సామాజిక` ముసలం
మునుగోడు కేంద్రంగా అభ్యర్థిత్వాల `రేస్` సామాజిక స్లోగన్ దిశగా వెళుతోంది. ఇలాంటి పరిణామం అధికారంలోని టీఆర్ఎస్ పార్టీ తలనొప్పిగా మారింది. ఎవరికి వారే తమ సామాజికవర్గాల నేతలకు అభ్యర్థిత్వాన్ని ప్రోమోట్ చేస్తూ మునుగోడు టీఆర్ఎస్ లీడర్లు ప్రయత్నం చేస్తున్నారు.
- By CS Rao Published Date - 01:00 PM, Wed - 10 August 22
మునుగోడు కేంద్రంగా అభ్యర్థిత్వాల `రేస్` సామాజిక స్లోగన్ దిశగా వెళుతోంది. ఇలాంటి పరిణామం అధికారంలోని టీఆర్ఎస్ పార్టీ తలనొప్పిగా మారింది. ఎవరికి వారే తమ సామాజికవర్గాల నేతలకు అభ్యర్థిత్వాన్ని ప్రోమోట్ చేస్తూ మునుగోడు టీఆర్ఎస్ లీడర్లు ప్రయత్నం చేస్తున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించే వరకు వేచిచూడాలని కేసీఆర్ సంకేతాలు ఇచ్చారట.కాంగ్రెస్ పార్టీ తరపున మునుగోడు అభ్యర్థిత్వాలను ఆశిస్తున్న వాళ్లలో ప్రముఖంగా పాల్వాయి స్రవంతి, పటోళ్ల రమేష్ రెడ్డి, చెరుకు సుధాకర్, పల్లె రవి ఉన్నారు. వీళ్లను కాదని, ఇతరులను రంగంలోకి దింపడానికి దాదాపుగా అవకాశం ఉండదని తెలుస్తోంది. అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తోన్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం రెడ్డి లేదా వెనుకబడిన తరగతుల (బీసీ) వర్గాల అభ్యర్థిని ఎంపిక చేయాలా? అనే అంశంపై టీఆర్ఎస్ నాయకత్వం చిక్కుల్లో పడింది. ఇరు వర్గాలకు చెందిన నాయకులు తమ వర్గాలకు పార్టీ టిక్కెట్టు కోసం తీవ్రంగా లాబీయింగ్ చేయడంతో, పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించడంలో తొందరపడొద్దని పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంకేతాలు ఇచ్చారట. మునుగోడు ఓటర్లు మెజారిటీగా ఉన్న సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపాలని టీఆర్ఎస్ బీసీ నేతలు పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకునే ముందు కాంగ్రెస్ అభ్యర్థిపై స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని సీఎం భావిస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు మంగళవారం సీఎంను కలిసి రెడ్డి లేదా బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని అభ్యర్థించారు. లోక్సభ మాజీ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, స్థానిక నేత కర్నాటి విద్యాసాగర్ (పద్మశాలి), నారబోయిన రవి (ముదిరాజ్)లు బీసీ కోటా కింద టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. రియల్టర్, బిల్డర్ రవి బీసీ నేతల్లో ఆర్థికంగా అత్యంత భద్రత ఉన్నవాడని, రాజ్గోపాల్రెడ్డికి సవాల్గా నిలిచేందుకు టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తుందట. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నల్గొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తన సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. టీఎస్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి టిక్కెట్టు కోరుతున్నారని తెలుస్తోంది.
2014లో మునుగోడులో గెలిచి 2018లో హుజూర్నగర్లో సైదిరెడ్డితో ఓడిపోయిన కె.ప్రభాకర్రెడ్డికి మరోసారి అవకాశం కల్పించాలని ఇంధన శాఖ మంత్రి, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ఇంచార్జి జి.జగదీష్రెడ్డి నాయకత్వంలో సంప్రదాయాన్ని అనుసరించాలన్నారు. 2018లో కాంగ్రెస్ మాజీ టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో సైదిరెడ్డి ఓడిపోయారు. కానీ 2021 అక్టోబర్లో జరిగిన ఉపఎన్నికల్లో అదే స్థానంలో గెలిచారు. మొత్తం మీద టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడానికి కసరత్తు చేస్తోంది. కానీ, ఎవరికి వారే ఆ పార్టీ సీనియర్లు కేసీఆర్ వద్ద పలు ప్రతిపాదనలు పెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించే వరకు వేచిచూడాలని కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నారట.
Related News
Telangana: మూడు పార్టీలు మారిన చరిత్ర కేసీఆర్ ది
పార్టీ మారినట్లు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసమే పార్టీ మారానని, ఒక పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరానని స్పష్టం చేశారు