Kadiyam Srihari : కడియం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బిఆర్ఎస్ నేతలు
- By Sudheer Published Date - 12:48 PM, Fri - 29 March 24
కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరబోతున్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఫై బిఆర్ఎస్ (BRS) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ అధిష్టానానికి వరుసగా నేతలు షాక్ ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ వెంట నడిచిన కీలక నేతలు సైతం పార్టీని వీడుతూ వస్తున్నారు. తాజాగా కడియం తో పాటు ఆయన కూతురు కూడా ఇప్పుడు పార్టీ ని వీడుతుండడం ఫై బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
శుక్రవారం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి ముందే కడియం శ్రీహరి పార్టీ మార్పు నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో ఆయన ఫొటోలు తొలగించారు. అయితే, పార్టీ మారడం ఖాయమని ఇంకా కడియం అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.
గురువారం రాత్రి వరంగల్ లోక్సభ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన కూతురు కడియం కావ్య ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, భూ కబ్జాలు వంటివి పార్టీ ప్రతిష్టను దెబ్బ తీశాయని.. పరిణామాలతో జిల్లాలో లీడర్లలో కూడా సమన్వయం లోపించింది. ఈ క్రమంలోనే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
Read Also : Balakrishna: లెజెండ్ కు10ఏళ్ళు.. వైరల్ అవుతున్న బాలయ్య పొలిటికల్ కామెంట్స్?
Related News
Lok Sabha Elections 2024: 10-11 సీట్లు గెలిస్తే కేసీఆరే మళ్లీ తెలంగాణ సీఎం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్10-11 లోక్సభ స్థానాలు గెలిస్తే తెలంగాణలో మళ్లీ ఏడాదిలోపే బీఆర్ఎస్ అధినేత కేసీఆరే సీఎం అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.