Lok Sabha Polls 2024: తమిళిసై మత ప్రచారం.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేయడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళిసై పై బీఆర్ఎస్ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసింది.
- By Praveen Aluthuru Published Date - 12:13 AM, Thu - 9 May 24

Lok Sabha Polls 2024: అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేయడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళిసై పై బీఆర్ఎస్ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసింది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి జి కిషన్రెడ్డి తరపున ప్రచారం చేస్తూ హైదరాబాద్లోని ఎమ్మెల్యే కాలనీలో రామమందిరం ప్రతిరూపాలను పంచిపెట్టడం ద్వారా తమిళిసై సౌందరరాజన్ ఉద్దేశపూర్వకంగానే ఐపీసీ సెక్షన్ 188, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లను ఉల్లంఘించారని బీఆర్ఎస్ తన ఫిర్యాదులో పేర్కొంది.
తమిళిసై తెలిసి తెలిసి ఎన్నికల కోడ్ ని ధిక్కరించారని, మతం ఆధారంగా పార్టీని ప్రోత్సహించారని, రామమందిర ప్రతిరూపాలను సామాన్య ప్రజలకు పంపిణీ చేశారని బీఆర్ఎస్ పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం రామమందిరానికి ప్రతిరూపాలు వంటి మతపరమైన చిహ్నాలను పంపిణీ చేయడం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అని బీఆర్ఎస్ పేర్కొంది.
ఒక నిర్దిష్ట పార్టీ మరియు అభ్యర్థికి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి మతపరమైన భావాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించింది. MCCని ఉల్లంఘించినందుకు తమిళిసై సౌందరరాజన్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను బీఆర్ఎస్ కోరింది. తమిళిసై సౌందరరాజన్ను భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా తక్షణమే డిబార్ చేయాలని, అలాగే జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది.
Also Read: Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు గుడ్ న్యూస్.. రీజన్ ఇదే..!