HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp Mega Event With 15000 People At Hitex

BJP Mega Event: హైటెక్స్‌లో 15 వేల మందితో బీజేపీ మెగా ఈవెంట్!

సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి దేశానికి నాయకుడిగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో ఎవరికీ తెలియని కోణాలను, ఆయన అంకితభావాన్ని, నిస్వార్థ సేవను, పటిష్ట నాయకత్వ లక్షణాలను ఈ ప్రదర్శన ప్రజలకు తెలియజేయనుంది.

  • Author : Gopichand Date : 28-09-2025 - 7:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BJP Mega Event
BJP Mega Event

BJP Mega Event: తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (BJP Mega Event) హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో (HITEX) భారీ కార్యక్రమానికి రంగం సిద్ధం చేసింది. ఈ నెల 30న (మంగ‌ళ‌వారం) దాదాపు 15 వేల మంది కార్యకర్తలు, ప్రజల సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘మేరా దేశ్ పహలే: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోదీ’ పేరుతో ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించనుంది.

మోదీ జీవితగాథ- ప్రజల కోసం ప్రదర్శన

సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి దేశానికి నాయకుడిగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో ఎవరికీ తెలియని కోణాలను, ఆయన అంకితభావాన్ని, నిస్వార్థ సేవను, పటిష్ట నాయకత్వ లక్షణాలను ఈ ప్రదర్శన ప్రజలకు తెలియజేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖ ఆర్టిస్ట్, రచయిత మనోజ్ ముంతశిర్ హాజరుకానున్నారు. దేశభక్తి, స్ఫూర్తిని నింపే ఆయన ప్రదర్శన ఈవెంట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఏర్పాట్ల పర్యవేక్షణ

ఈ మెగా కార్యక్రమం ఏర్పాట్ల పనులను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. రామచందర్ రావు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం స్వయంగా హైటెక్స్‌లో పరిశీలించారు. వేదిక, భద్రతా ఏర్పాట్లు, సాంకేతిక అంశాలపై సంతృప్తి వ్యక్తం చేసిన నేతలు, కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ.. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. దేశంలో కోట్లాది మంది యువతకు ఆయన ఆదర్శం, స్ఫూర్తి. ఆయన బాల్యం నుంచి నేటి వరకు దేశం కోసం చేసిన నిరంతర కృషి, త్యాగాలు, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్న తీరును ఈ ప్రదర్శన ద్వారా ప్రజలకు వివరిస్తాము. ముఖ్యంగా యువత ఈ ప్రదర్శనను చూసి మరింత ప్రేరణ పొందాలి” అని అన్నారు. ‘మేరా దేశ్ పహలే’ అంటే ‘దేశమే ప్రథమం’ అనే భావనను ఈ కార్యక్రమం ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

Also Read: IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్.. టాస్ గెలిచిన వారికే ట్రోఫీనా?

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి, ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం కీలకం కానుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలు, పేదల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలను ఈ ప్రదర్శనలో వివరిస్తారని, ఇది కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దాదాపు 15,000 మందికి పైగా పాల్గొనే అవకాశం ఉన్న ఈ భారీ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని బీజేపీ శ్రేణులను మరింత బలోపేతం చేసి రాష్ట్ర రాజకీయాలపై తన ప్రభావాన్ని పెంచుకోవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రదర్శన ద్వారా మోదీ వ్యక్తిగత జీవితం నుంచి దేశభక్తి మరియు ‘దేశమే ప్రథమం’ అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి పార్టీ సిద్ధమవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP Mega Event
  • Hitex
  • hyderabad
  • pm modi
  • telangana
  • telugu news

Related News

Jagan Allegations PM Modi

ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

ఇక మెడికల్ కాలేజీల ఖర్చు విషయంలోనూ జగన్‌ రెడ్డి శుద్ధ అబద్దాలు చెప్పారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీ స్టాఫ్‌ ఖర్చు కోసం ప్రభుత్వం ఏడాదికి వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని.. ఇది ప్రైవేటు సంస్థలకు మేలు చేయడమే అంటున్నారు జగన్‌రెడ్డి.

  • Christmas Holidays 2025 Sch

    విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

  • Maoists Khali

    తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

  • Tgpsc Group 3 Results

    గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • Chief Election Commissioner Gyanesh Kumar's visit to Telugu states

    తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

Latest News

  • ప్రమాదానికి గురైన బాలీవుడ్ హాట్ బ్యూటీ

  • అసిడిటీకి యాంటాసిడ్స్‌నే పరిష్కారమా? వైద్యుల హెచ్చరికలు ఇవే..!

  • గ్రామీణ ఉపాధి చట్టంపై ‘బుల్డోజర్ రాజకీయాలు’: సోనియా గాంధీ విమర్శలు

  • టెస్లా మస్క్ పారితోషికంపై కోర్టు కీలక తీర్పు: 2018 ఒప్పందానికి మళ్లీ చట్టబద్ధత

  • తోషఖానా అవినీతి కేసు: ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలుశిక్ష

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd