HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Big Shock To Brs Party

Big Shock to BRS Party : ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న బిఆర్ఎస్ కీలక నేతలు

మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు

  • Author : Sudheer Date : 28-09-2023 - 8:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Big Shock To Brs
Big Shock To Brs

బిఆర్ఎస్ పార్టీ (BRS Party) నుండి బయటకు వచ్చిన కీలక నేతలంతా ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao), ఆయన కుమారుడు రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham), కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy ) తదితరులు పాల్గొన్నారు.

మల్కాజ్గిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు..తనకు బిఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చినప్పటికీ..తన కొడుక్కు టికెట్ ఇవ్వకపోవడం తో ఆగ్రహం తో బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుండి మెదక్ టికెట్ తన కొడుకు రావడం , అలాగే మైనంపల్లి హన్మంతరావు కు మల్కాజ్గిరి టికెట్ ఓకే అయినట్లు తెలుస్తుంది. అలాగే మిగతా వారికీ కూడా వారి వారి నియోజకవర్గాలలో కాంగ్రెస్ టికెట్ ఖరాయినట్లు సమాచారం. మొత్తం మీద బిఆర్ఎస్ కీలక నేతలంతా కాంగ్రెస్ లో చేరుతుంటే..పార్టీ ఫుల్ జోష్ మీద ఉంది. అయితే నల్గొండ నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరుతుంటే..కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం తట్టుకోలేకపోతున్నారు.

తనను సంప్రదించకుండానే.. తన నియోజకవర్గానికి చెందిన నేతలను, అందునా తనపై విమర్శలు చేస్తున్న నేతలను రేవంత్ పార్టీలో చేర్చుకుంటున్నారని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. మొన్నటికి మొన్న వేముల వీరేశం, నిన్న కుంభం అనిల్‌లను పార్టీలో చేర్చుకోవడంపై అలకపాన్పు ఎక్కారట. ప్రధానంగా కుంభం అనిల్ చేరికను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. యాదాద్రి DCC అధ్యక్షుడిగా ఉన్న కుంభం అనిల్ ఇటీవల పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, మందుల సామేలును కోమటిరెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

ఆయనే స్వయంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, ఇటీవల రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి.. పార్టీని వీడిన కుంభం అనిల్‌ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనే స్వయంగా కండువా కప్పి మళ్లీ పార్టీలో చేర్చారు. అయితే, కుంభం అనిల్ పార్టీలో చేరిన విషయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అస్సలు తెలియదట. ఈ విషయంలో మరింత ఆగ్రహంతో ఉన్నారట కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మరి మరి ముందు ముందు ఇంకెంత అలక పాన్పు ఎక్కుతారో కోమటిరెడ్డి అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.

Read Also : AIMIM Eye AP: ఏపీ రాజకీయాల్లోకి ఎంఐఎం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Big Shock to BRS
  • congress party
  • mallikarjun kharge
  • Mynampally Hanumanth Rao

Related News

Erravalli Farmhouse Seethakka, Konda Surekha,

కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మంత్రులు సీతక్క, కొండా సురేఖ గురువారం (జనవరి 8) మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మేడారం సమ్మక్క, సారక్క మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసి.. వనదేవతల పండుగకు రావాలని కోరనున్నట్లు సమాచారం. కాగా, మేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పటిష్ట

    Latest News

    • ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ హైకోర్టులో ఊరట

    • సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్ : కిటకిటలాడుతున్న బస్టాండ్లు , రైల్వే స్టేషన్లు

    • వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

    • జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

    • జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్‌!

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd