Jubilee Hills Bypoll: ప్రచార బరిలో బిగ్ బుల్స్..ఇక దూకుడే దూకుడు
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు అయిన కాంగ్రెస్, BRS, BJPలు తమ గెలుపు కోసం పూర్తి స్థాయిలో బరిలోకి దిగాయి
- By Sudheer Published Date - 07:55 AM, Wed - 22 October 25

జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు అయిన కాంగ్రెస్, BRS, BJPలు తమ గెలుపు కోసం పూర్తి స్థాయిలో బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల జాబితానే రాజకీయ ఉత్సాహానికి దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టి ప్రజల నమ్మకాన్ని మరింత బలపరచాలని చూస్తున్నారు. అటు మాజీ ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ తన మాస్టర్ స్ట్రోక్ ప్రచారంతో పార్టీ cadreను మళ్లీ ఉత్తేజపరచే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, BJP తరఫున, హైదరాబాద్లో పార్టీ బలాన్ని ప్రదర్శిస్తూ ఈ ఉపఎన్నికను తమ ఉనికి నిరూపణగా మార్చాలని సంకల్పించారు.
Asia Cup Trophy: ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. బీసీసీఐ సంచలన నిర్ణయం!
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రతిష్ఠాత్మక పోరాటం. ప్రజలలో ప్రభుత్వం పట్ల ఉన్న స్పందనను అంచనా వేసే పరీక్షగా కూడా ఈ ఎన్నికను పార్టీ చూస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వాగ్దానాలు అమలు దిశగా తీసుకున్న చర్యలను హైలైట్ చేస్తూ ఓటర్లకు చేరువ కావాలని భావిస్తున్నారు. మరోవైపు, BRS ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీకి గత ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల వాతావరణం నుండి బయటపడటానికి ఈ ఉపఎన్నిక మంచి అవకాశం అనే భావన గులాబీ శిబిరంలో నెలకొంది.
BJP మాత్రం ఈ పోరులో సర్ప్రైజ్ ఫ్యాక్టర్గా నిలవాలని చూస్తోంది. జూబ్లీహిల్స్ వంటి పట్టణ నియోజకవర్గంలో మధ్యతరగతి, యువత వర్గాలను ఆకర్షించేందుకు పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించింది. కిషన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ స్థానిక అభ్యర్థికి మద్దతుగా జాతీయ అంశాలను ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తున్నది. మొత్తానికి, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ సమీకరణాలకు కొత్త మలుపు తిప్పే అవకాశముంది. ఎవరి ప్రచారం ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో నవంబర్లో వెలువడే ఫలితమే తేల్చనుంది.