Free Electricity Scheme: విద్యుత్ బిల్లులు కట్టొద్దన్న వ్యాఖ్యలపై కేటీఆర్ ని నిలదీసిన బట్టి
హైదరాబాద్ వాసులు విద్యుత్ బిల్లులు కట్టడం మానుకోవాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేమిటని బట్టి ప్రశ్నించారు.
- By Praveen Aluthuru Published Date - 08:24 PM, Sat - 20 January 24

Free Electricity Scheme: హైదరాబాద్ వాసులు విద్యుత్ బిల్లులు కట్టడం మానుకోవాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేమిటని బట్టి ప్రశ్నించారు. నీచ బుద్ధి ఉన్న వారే ఇలాంటి ప్రకటనలు చేస్తారని ఫైర్ అయ్యారు. రాష్ట్రం అంధకారంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారా? కరెంటు శాఖను అప్పులపాలు చేసి ఇప్పుడు బిల్లులు కట్టవద్దని ప్రజలను కోరుతున్నారా అని సూటిగా ప్రశ్నించారు.
గృహజ్యోతి పథకం అమలయ్యే వరకు హైదరాబాద్ వాసులు విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని కేటీఆర్ కోరారు. ఇంటింటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు వాగ్దానాలలో ఈ పథకం ఒకటి. ఈ పథకం అమలు కాకపోతే మీ కరెంట్ బిల్లులను ఢిల్లీలోని 10 జనపథ్లోని సోనియా గాంధీ నివాసానికి పంపండని సూచించాడు కేటీఆర్. గృహ జ్యోతి పథకం ద్వారా అద్దెదారులతో సహా హైదరాబాద్లోని ప్రతి మీటరుకు ఉచిత విద్యుత్తు అందేలా చూడాలని చెప్పాడు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీలు విలీనానికి ప్లాన్ చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్కు చెందిన ఏకనాథ్ షిండే అని ఆయన అభివర్ణించారు. ఆయన బిజెపితో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. రేవంత్ బీజేపీకి సన్నిహితుడు. అతను ‘చోటా మోడీ’ మాత్రమే కాదు అదానీ స్నేహితుడని వ్యంగ్యం ప్రదర్శించాడు. 100 రోజుల్లో హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టకుండా, అదానీతో రేవంత్ లావాదేవీలకు పాల్పడ్డారని కేటీఆర్ అన్నారు.
Also Read: TSRTC : సిబ్బందికి గుడ్ న్యూస్ తెలిపిన TSRTC