Bandi Letter To KCR: రైతుల కష్టాలపై సీఎం కేసీఆర్ కు …బండి సంజయ్ లేఖ.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు...బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
- By Hashtag U Published Date - 10:17 AM, Fri - 22 April 22
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు…బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతు రుణమాఫీ, కౌలు రైతులకు రక్షణ, రైతు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ ఈ లేఖను రాశారు. రైతుల సంక్షేమం కోసం సర్కార్ వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 14లక్షల మంది కౌలు రైతులకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందన్నారు. రైతుల డిమాండ్ల కోసం…రాష్ట్ర ప్రభుత్వం సహాయం కోసం నిరసనలు చేస్తున్నామని ఆయన తన లేఖలో వివరించారు. ప్రస్తుతం తాను కొనసాగిస్తున్న పాదయాత్రలో చాలా మంది కౌలు రైతులు తనను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
బహిరంగ లేఖలో ఏం రాసారంటే…
ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడుత పాదయాత్రలో భాగంగా చాలా మంది రైతులు తనను కలిశారనీ..గత వారం రోజులుగా ఏ గ్రామానికి వెళ్లినా వందలాది మంది రైతులు తమ దగ్గరకు వచ్చి రైతు రుణమాఫీ జరగలేదని తమ గోడును చెప్పుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీలో చోటుచేసుకుంటున్న జాప్యం కారణంగా ఎంతో మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నట్లు రాశారు. రాష్ట్రంలోని దాదాపు 14లక్షల మంది కౌలు రైతులకు ఎలాంటి రక్షణ లేదన్నారు. దీంతో ఆయా వర్గాల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని తెలిపారు. సర్కార్ నుంచి రైతులకు అందే ప్రయోజనాల్లో కౌలు రైతుకలకు ఎలాంటి లబ్ది చేకూరలేకపోవడం విచారకరమన్నారు. వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని సంజయ్ డిమాండ్ చేశారు.
కాగా 2018 ఎన్నికల వేళ TRSలక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తుందన్న హామీ ఇచ్చింది. కానీ ఈ నాలుగేండ్లలో సర్కార్ రూ. 20,164.20కోట్లు కేటాయించినట్లు భజన చేస్తుందని విమర్శించారు. మొత్తం కేటాయింపుల్లో కేవలం 1.144.38కోట్లు మాత్రమే రిలీజ్ చేసిందని పేర్కొన్నారు. దీంతో 5.66లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగగా దాదాపు 31లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. 25వేల రూపాయల లోపు రుణమాఫీ కావాల్సిన రైతులు 2.96లక్షల మంది ఉండగా…వారికి రుణమాఫీ కావాల్సింది 408.30కోట్లని రాశారు. 25వేల రూపాయల నుంచి 50వేల రూపాయల లోపు రుణమాఫీ కావాల్సిన రైతులు 5.72 లక్షల మంది ఉండగా…వారి రుణాలు 1,7900కోట్ల రూపాయాలని లేఖలోపేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల డబ్బులు రైతుల ఖాతాల్లో పడితే వాటిని కింద బ్యాంకులు జమ చేసుకుంటున్నాయని ఈ సందర్భంగా బండి సంజయ్ లేఖలోతెలిపారు. పెండింగ్ లోఉన్న రైతు రుణమాఫీ బాకాయిలును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు.
Tags
Related News
Telangana : రేపు తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ నిరసన కార్యక్రమం
ఇప్పటికే రైతుబంధు ఇవ్వక, రైతు భరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు ఇలా మాట మార్చి మరోసారి రైతులను మోసం చేసిందని..ఇందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా రేపు బిఆర్ఎస్ శ్రేణులు , రైతులు నిరసన చేపట్టాలని’ కేసీఆర్ పిలుపునిచ్చారు.