Bandi Sanjay: ‘హుస్సేన్ సాగర్’ను ‘వినాయక సాగర్’ గా మార్చేసిన బండి!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గణేష్ ఉత్సవాలకు సరైన ఏర్పాట్లు చేయడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
- By Balu J Published Date - 05:36 PM, Thu - 8 September 22
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గణేష్ ఉత్సవాలకు సరైన ఏర్పాట్లు చేయడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడిన ఆయన ‘హుస్సేన్ సాగర్’ను ‘వినాయక సాగర్’ అని సంబోధించారు. “ప్రతి సంవత్సరం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వారు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన తర్వాతే ప్రభుత్వం ఏర్పాట్లను ప్రారంభించింది’’ బండి అని ఆరోపించారు.
“రెండు రోజుల్లో పెద్దఎత్తున నిమజ్జనాలు జరగనున్నాయి, కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఉదయం కొన్ని క్రేన్లు మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి. గతేడాది సుమారు 60 క్రేన్లను ఏర్పాటు చేశారు. హిందువులు ఈ పరిస్థితి గురించి ఆలోచించాలి” అని బండి సంజయ్ అన్నారు. గతంలో హైదరాబాద్, చార్మినార్ పేర్ల మార్పు గురించి డిమాండ్ చేసిన సంజయ్, తాజాగా హుస్సేన్ సాగర్ ను వినాయక సాగర్ గా నామకరణం చేయడం చర్చనీయాంశమవుతోంది.
Related News
Sanjay : బండి సంజయ్పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station)లో కేసు(case) నమోదయింది. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. బండి సంజయ్తో పాటు ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మరికొందరిపై కేసు నమోదయింది. ఓ వర్గం దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు బండి సంజయ్ ని�