TU: వీ.సీ.పోస్టు అమ్ముకోకపోతే తెలంగాణ వర్శిటీ వైస్ చాన్సలర్ రవీందర్ ను తొలగించండి: బండి సంజయ్ సవాల్..!!
తెలంగాణ యూనివర్సిటీ వీసీని తొలగించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ డిమాండ్ చేశారు.
- By hashtagu Published Date - 09:41 AM, Tue - 13 September 22
ప్రజాసంగ్రామయాత్ర ప్రారంభ సభలో తెలంగాణ వర్సటీ వీసీ వ్యవహారంపై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన వీసీ ని పదవిలో నుంచి తొలగించాలన్నారు. విద్యార్థులను వీసీ బెదిరించడం సరికాదన్నారు. తాను డబ్బులిచ్చి పదవి కొన్నానని ఎవరూ ఏం చేయలేరని వీసీ తమతో అన్నట్టు విద్యార్థులు చెప్పారన్నారు. ప్రభుత్వం వీసీ పోస్టును అమ్ముకోకపోతే రవీందర్ గుప్తాను పదవి నుంచి పీకేయాలన్నారు. లేకపోతే వీసీ చెప్పిందే నిజమని బావించాల్సి వస్తుందన్నారు సంజయ్.
మరోవైపు వీసీ పై మండిపడుతున్నారు విద్యార్థులు. వీసీ అంటే యూనివర్శిటీకి పెద్దదిక్కు. తండ్రిస్థానంలో ఉండి విద్యార్థుల బాగోగులు చూస్కోవల్సినవాడు. కానీ రాత్రి వేళ లేడీస్ హాస్టల్ కు వెళ్లివిద్యార్థినులను ఇబ్బంది పెట్టాడు. ఇద్దరు బయట వ్యక్తులను తీస్కెళ్లాడు. వీసీ కుమారుడు కూడా హాస్టల్ కు వెళ్లాడని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. మగవాళ్లకు ఉదయం పూటనే అనుమతిలేని లేడీస్ హాస్టల్ కు రాత్రిపూట వెళ్లాడు వీసీ. విద్యార్థినులు వినాయక నిమజ్జనం అనంతరం డ్యాన్స్ లు చేస్తుంటే వాళ్ల మధ్యలో చేరాడు. వీసీ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. జేబుల్లోంచి నోట్ల కట్టలు తీసీ బార్ గర్ల్స్ పై వెదజల్లినట్లు విద్యార్థినులపై వెదజల్లారు. వీసీ తీరుపై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీసీ ని తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
వీసీపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక వీసీ పై ఇంత స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం.. విపక్షాలు స్పందించడం ఇదే తొలిసరి.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందో లేదో చూడాలి మరి.
Related News
Telangana : రేపు తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ నిరసన కార్యక్రమం
ఇప్పటికే రైతుబంధు ఇవ్వక, రైతు భరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు ఇలా మాట మార్చి మరోసారి రైతులను మోసం చేసిందని..ఇందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా రేపు బిఆర్ఎస్ శ్రేణులు , రైతులు నిరసన చేపట్టాలని’ కేసీఆర్ పిలుపునిచ్చారు.