Kavitha Arrest : ఎప్పటిలాగానే ఈడీ ముందు..వెనుకాల మోడీ – బిఆర్ఎస్ సెటైర్లు
- By Sudheer Published Date - 08:04 PM, Fri - 15 March 24
ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరుగుతుంటే అక్కడికి ముందుగా ఈడీ వస్తుందని, ఆ తర్వాత ప్రధాని మోడీ వస్తారంటూ ట్విటర్ వేదికగా బిఆర్ఎస్ ట్వీట్ చేసింది. హైదరాబాద్ మహానగరంలో బిజెపి , బిఆర్ఎస్ , కాంగ్రెస్ లకు సంబంధించి మూడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేయడం.. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ముస్లిం సోదరులకు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం… ప్రధాని మోదీ మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థుల తరఫున రోడ్ షో నిర్వ్హయించడం ఇలా మూడు కీలక ఘటనలు చోటుచేసుకున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ మూడు పరిణామాలు ప్రస్తుతం వార్తల్లో హైలైట్ గా మారాయి. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ను అరెస్ట్ చేయడం బిఆర్ఎస్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఎప్పుడైనా సరే దేశంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు..ఈడీ అధికారులు అలర్ట్ అవుతారు. కోర్ట్ లలో నడుస్తున్న కేసులకు సంబధించి పార్టీల నేతలను అరెస్ట్ చేయడం వంటివి చేస్తుంటారు. గతంలో కూడా ఇలాగే చేసి వార్తల్లో నిలిచారు. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి రేపు నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో కవిత ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం ఫై బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరుగుతుంటే అక్కడికి ముందుగా ఈడీ వస్తుందని, ఆ తర్వాత మోదీ వస్తారంటూ ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రానికి ఈరోజు మధ్యాహ్నం ఎమ్మెల్సీ కవిత ఇంటికి ఈడీ వస్తే.. సాయంత్రం మోడీ వచ్చారంటూ సెటైర్లు వేశారు. కాగా, ‘వెల్కమ్ మోదీ.. థ్యాంక్యూ ఈడీ’ అని BJP నేతలు ట్వీట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం కవితను ఢిల్లీకి తరలిస్తున్నారు. మరికాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఆమెను ఢిల్లీ కి తీసుకెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం మెడికల్ టెస్ట్ లు చేసి కోర్ట్ లో హాజరుపరచనున్నారు.
Read Also : Upma Bonda: మిగిలిపోయిన ఉప్మా తో టేస్టీగా బోండాలు తయారు చేసుకోండిలా?
Tags
Related News
Telangana : వారసత్వ రాజకీయాలు చేయడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు – మోడీ
జూన్ 4న త్రిపుల్ తలాఖ్, సీఏఏ, ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన వారు ఓడిపోక తప్పదని మోడీ అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దని ప్రజలు నిశ్చయించుకున్నారని, బీజేపీని గెలిపించుకోవాలని ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు