HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Amit Shah To Telangana 0n 28th Of This Month

Amit Shah to Telangana: మిషన్ తెలంగాణ షురూ.. ఈనెల 28న రాష్ట్రానికి అమిత్‌ షా

తెలంగాణ (Telangana)లో బీజేపీ అధికారమే ధ్యేయంగా కమలనాథులు తన కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఉత్తర భారతంలో పూర్తి పట్టు సాధించిన బీజేపీ ఇప్పుడు దక్షిణ భారతంపై దృష్టి సారించింది. తెలంగాణపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం తరచూ తెలంగాణకు వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈ నెల 28న తెలంగాణలో పర్యటించనున్నారు.

  • Author : Gopi Date : 11-01-2023 - 6:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hm Amit Shah
Hm Amit Shah

తెలంగాణ (Telangana)లో బీజేపీ అధికారమే ధ్యేయంగా కమలనాథులు తన కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఉత్తర భారతంలో పూర్తి పట్టు సాధించిన బీజేపీ ఇప్పుడు దక్షిణ భారతంపై దృష్టి సారించింది. తెలంగాణపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం తరచూ తెలంగాణకు వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈ నెల 28న తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ జనవరి 19న హైదరాబాద్ వచ్చి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే హోంమంత్రి అమిత్ షా రాక కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జాతీయ నేతలు పదే పదే తెలంగాణలో పర్యటిస్తున్నారు. మరో ఎనిమిది నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చునని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధినేత అమిత్ షా ఈ నెల 28న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ స్థాయిల పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత అంశాలే ఆయన పర్యటనలో ప్రధాన ఎజెండా. తెలంగాణ ఎన్నికల సీజన్ పై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. సంఘ్ నేతలతో ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉంది. అమిత్ షా గతేడాది 5 సార్లు తెలంగాణకు వచ్చారు. మరోవైపు ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను కూడా ప్రారంభించనున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో మోదీ ప్రసంగం జరిగే అవకాశం ఉంది.

Also Read: Nabha Natesh : ప్రమాదం వల్లనే సినిమాలకు గ్యాప్..నభా నటేశ్!

మరోవైపు అంతకంటే ముందే రాష్ట్రంలో కేసీఆర్, మోదీల బహిరంగ సభలు జరగనున్నాయి. రెండు రోజుల తేడాతో రెండు బహిరంగ సభలు జరగనుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. మోదీ, అమిత్ లపై కేసీఆర్ విమర్శలు చేస్తుంటే బీజేపీ నేతలంతా కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ అదే స్థాయిలో విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. కాగా, అమిత్ షా ఈ నెల 8న ఏపీలో పర్యటించాల్సి ఉంది. అయితే అదే రోజు కర్ణాటకలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆయన ఏపీకి ఎప్పుడు వస్తారనేది త్వరలోనే బీజేపీ నేతలు ప్రకటించనున్నారు.

టార్గెట్ 90 పేరుతో వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అస్త్రాలను సిద్ధం చేస్తున్న బీజేపీ.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్పీడ్ పెంచింది. ఫిబ్రవరి 15 నుంచి అసెంబ్లీ స్థాయి సమావేశాలు, మార్చి 5 నుంచి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని ఎంపీ లక్ష్మణ్‌ ఇటీవల ప్రకటించారు. ఏప్రిల్‌లో ప్రభుత్వంపై చార్జిషీట్‌ దాఖలు చేస్తామని, మిషన్‌ 90తో ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించిందని ఆయన వివరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • bjp
  • cm kcr
  • pm modi
  • telangana
  • ts politics
  • Union Home Minister Amit Shah

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Prashant Kishor To Contest

    Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd