HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Amit Shah To Address Public Meeting In Siddipet

Amit Shah: తెలంగాణ‌పై బీజేపీ దృష్టి.. నేడు సిద్దిపేటకు అమిత్ షా

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తొలి బహిరంగ సభకు సిద్దిపేట‌ వేదికైంది.

  • Author : Gopichand Date : 25-04-2024 - 10:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amit Shah
Minor changes in Amit Shah's Telangana tour

Amit Shah: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తొలి బహిరంగ సభకు సిద్దిపేట‌ వేదికైంది. గురువారం సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించనున్నారు. షా ఉదయం 11 గంటలకు సిద్దిపేటకు చేరుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎన్నికల సభలో ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర చీఫ్ జి. కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్‌, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎం. రఘునందన్‌రావు, పలువురు సీనియర్‌ నేతలు హాజరుకానున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ కూడా గురువారం కరీంనగర్, నాగర్‌కర్నూల్‌లలో ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ ర్యాలీలో కూడా ఆయన పాల్గొంటారు. నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్ నామినేషన్ ర్యాలీలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి పాల్గొంటారు. అయితే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం మే 13న తెలంగాణ నాలుగో దశలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం చేస్తున్నాయి.

Also Read: Jawa Yezdi Motorcycles: జావా బైక్ ఉన్న‌వారికి గుడ్ న్యూస్‌.. రేపు ఫ్రీ పార్ట్ రీప్లేస్‌మెంట్, ఎక్కడంటే..?

తెలుగు రాష్ట్రాల్లో మోదీ ప‌ర్య‌ట‌న‌

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 30, మే 3, 4 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. ఏప్రిల్ 30న అందోల్‌లో జరిగే బహిరంగ సభకు మోదీ హాజరవుతారు. అనంతరం హైదరాబాద్‌లోని శెరిలింగంప‌ల్లిలో ఐటీ ఉద్యోగులతో పాటు నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతారు. మే 3న వరంగల్, భువనగిరి, నల్గొండ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. మే 4న నారాయణపేట, వికారాబాద్‌లలో జరిగే సభల్లో ప్రధాని ప్రసంగిస్తారని పార్టీ తెలిపింది.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 Lok Sabha Elections
  • amit shah
  • bjp
  • General Elections 2024
  • pm modi
  • telangana politics
  • ts politics

Related News

PM Modi

11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారమైన ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ లభించింది. ఇథియోపియా ప్రధానమంత్రి డాక్టర్ అబీ అహ్మద్ ఈ గౌరవాన్ని ప్రధానికి అందజేశారు.

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

  • Oman

    ఒమన్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ క‌రెన్సీ విశేషాలీవే!

  • Cm Stalin Counter To Amit S

    కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు CM స్టాలిన్ కౌంటర్

  • Congress

    Telangana Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ హస్తం హావ !!

Latest News

  • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

  • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

  • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

  • AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

  • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd