HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Adilabad Tribals Go No 49

Adilabad Tribals : ఫలించిన ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల పోరాటం

Adilabad Tribals : జీవో 49 ప్రకారం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3 లక్షల ఎకరాల అటవీ భూమిని కొమ్రంభీమ్ కన్జర్వేషన్ కారిడార్‌గా మార్చే యోచనతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నిర్ణయం ఆదివాసీలకు వారి సాంప్రదాయ జీవన ప్రాంతాలను కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చిపెట్టేది

  • Author : Sudheer Date : 21-07-2025 - 8:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Adilabad Tribals Protest On
Adilabad Tribals Protest On

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు (Adilabad Tribals) చేపట్టిన పోరాటం ఫలితాన్నిచ్చింది. గిరిజనుల భూములను కోల్పోతామన్న భయంతో వారు దీర్ఘకాలంగా వ్యతిరేకిస్తున్న జీవో నంబర్‌ 49ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించడంతో, గిరిజన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివాసీ నాయకులు, ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ముఖ్యమంత్రికి మరియు గిరిజన హక్కుల కోసం పోరాడిన నేత సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.

జీవో 49 ప్రకారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3 లక్షల ఎకరాల అటవీ భూమిని కొమ్రంభీమ్ కన్జర్వేషన్ కారిడార్‌గా మార్చే యోచనతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నిర్ణయం ఆదివాసీలకు వారి సాంప్రదాయ జీవన ప్రాంతాలను కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చిపెట్టేది. గిరిజనులు తమ భూములను సంప్రదాయ పద్ధతిలో సాగుచేస్తూ జీవనం సాగిస్తుండటంతో, ఈ జీవోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు.

Free Bus : ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ – రూల్స్ చూసుకోండి

ఇతర నాయకులను కలిసి తన గోడును చెప్పినా ప్రయోజనం లేకపోయింది. రోడ్లపై రిలే దీక్షలు, నిరసన ర్యాలీలు నిర్వహిస్తూ, ప్రజల దృష్టిని ఆకర్షించారు. చివరకు జీవో రద్దు కోసం సోమవారం ఉమ్మడి జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు వ్యాపారవేత్తలు, రవాణా శాఖ, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం విశేషం. ఉద్యమం పూర్తి శాంతియుతంగా జరగడంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది.

ముఖ్యమంత్రి జీవో 49ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో గిరిజనుల ఆందోళన తాత్కాలికంగా తగ్గింది. అయితే వారు ఈ జీవోను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిలిపివేత కంటే రద్దు అయితేనే భవిష్యత్తులో గిరిజనులకు భూసంరక్షణపై నమ్మకాన్ని కలిగించగలదని వారు అంటున్నారు. నిలిపివేసిన జీవోను ఎప్పుడైనా తిరిగి అమలు చేసే అవకాశం ఉందన్న అనుమానాలు గిరిజనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపై ప్రభుత్వం వారి డిమాండ్లను ఎంతవరకు పట్టించుకుంటుందన్నది వేచి చూడాల్సిన అంశం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adilabad Tribals
  • Adilabad Tribals Protest on GO No 49
  • cm revanth
  • GO No 49
  • telangana govt

Related News

Musi River

Musi River : రూ.5800 కోట్లతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు

  • Workers To Get Rs. Crore In

    కార్మికులకు రూ. కోటి బీమా – భట్టి ప్రకటన

  • Aasara Pension

    ఎట్టకేలకు ఆసరా పింఛన్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

  • Telugu States Water Dispute

    రాజకీయ లబ్ధి కోసమే జల వివాదం

  • Hilt Policy Telangana Assem

    హిల్ట్ పాలసీపై రేపు అసెంబ్లీలో చర్చ

Latest News

  • ‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!

  • టీ-20ల్లో ఫాఫ్ డు ప్లెసిస్ సరికొత్త చరిత్ర..!

  • అల‌ర్ట్‌.. చెవి క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలివే!

  • టీవీఎస్ ఎన్-టార్క్ 150.. హైపర్ స్పోర్ట్ స్కూటర్ యుగం ప్రారంభం!

  • కివీస్‌తో వన్డే సిరీస్.. ఆలస్యంగా జట్టుతో చేరనున్న రిషబ్ పంత్!

Trending News

    • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

    • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

    • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

    • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

    • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd