HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >A Gang Is Collecting Blood From Sheep And Goats Using Injections

గొర్రెల,మేకలు నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా..

  • Author : Vamsi Chowdary Korata Date : 07-01-2026 - 1:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Goat Sheep
Goat Sheep

Hyderabad మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో మేకలు, గొర్రెల రక్తాన్ని అక్రమంగా పిండేస్తున్న దందా ఇటీవల వెలుగులోకి వచ్చింది. స్థానిక మటన్ షాపు యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ కలిసి మేకలు, గొర్రెల నుంచి రక్తం సేకరిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోీసులు వారి నుంచి సమాచారం రాబట్టారు. దీంతో ఆ రక్తం కాచిగూడలోని ఓ ల్యాబ్‌లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. అనంతరం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు, ఈస్ట్ జోన్ పోలీసులు, క్లూస్ టీమ్ సంయుక్తంగా దాడులు నిర్వహించి.. ల్యాబ్‌​లో సిబ్బందిని ప్రశ్నించారు. మేకలు, గొర్రెల రక్తం నిల్వలు, కొనుగోలు పత్రాలు, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

  • ఇంజెక్షన్లతో మేకలు, గొర్రెల రక్తం పిండేసే ముఠా
  • కాచీగూడలోని ఓ ల్యాబ్‌కు విక్రయిస్తున్న నిందితులు
  • ఆ ల్యాబ్‌పై దాడులు జరిపిన అధికారులు

ఇటీవల మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నాగారం ప్రాంతంలోని సత్యనారాయణ కాలనీలో అమానుష ఘటన జరిగిన విషయం తెలిసిందే. మేకలు, గొర్రెలను హింసిస్తూ.. వాటి నుంచి రక్తం పిండేస్తున్న దందా వెలుగుచూసింది. స్థానిక మటన్ షాపు యజమాని, ఒక నకిలీ వెటర్నిటీ డాక్టర్‌తో కలిసి మేకలు, గొర్రెల నుంచి అడ్డగోలుగా రక్తాన్ని సేకరిస్తున్నారు. సూదులతో ఆ మూగజీవాల శరీరం నుంచి రక్తాన్ని పీల్చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. మెరుపు దాడి చేసి ఏకంగా 180 రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా ఈ అక్రమ దందా డొంక కదిలింది.

బతికున్న మూగ జీవాల నుంచి అమానుషంగా రక్తాన్ని పిండేసి అమ్ముతున్నారు. అయితే ఆ రక్తాన్ని కొనుగోలు చేస్తున్నది కాచిగూడ బద్రుక కాలేజీ సమీపంలోని సీఎన్కే ల్యాబ్స్ నిర్వాహకులేనని పోలీసుల విచారణలో తేలింది. దీంతో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు, ఈస్ట్ జోన్ పోలీసులు, క్లూస్ టీమ్ సంయుక్తంగా దాడులు నిర్వహించింది. ల్యాబ్‌లో సిబ్బందిని ప్రశ్నించి.. మేకలు, గొర్రెల రక్తం నిల్వలు, కొనుగోలు పత్రాలు, ఇతర రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ల్యాబ్ ఓనర్ పరార్..

మేకలు, గొర్రెల నుంచి అక్రమంగా రక్తం పిండేస్తున్న దందాలో కీలక సూత్రధారిగా భావిస్తున్న సీఎన్కే ల్యాబ్ యజమాని నికేశ్.. రెండు రోజుల ముందే పారిపోయాడు. దీంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నికేశ్ పోలీసులకు పట్టుబడితే.. ఈ అక్రమ దందాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది బయటపడుతుంది.

ఎందుకు రక్తం తీస్తున్నారు?

ఎలాంటి అనుమతి లేకుండా, నిబంధనలు పాటించకుండా మూగ జీవాలని హింసించి తీసిన రక్తాన్ని లేబొరేటరీలకు తరలిస్తున్నారు. ఆ ల్యాబ్‌ల్లో షీప్ బ్లడ్ అగర్ (Sheep Blood Agar) తయారీకి.. ఈ రక్తాన్ని వినియోగిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా ఈ రక్తాన్ని కొన్ని రకాల వ్యాధుల నివారణకు మందులుగా వాడుతున్నామని నమ్మిస్తూ.. ఇతర రాష్ట్రాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

కాగా, దాదాపు ఏడాది కాలంగా ఈ అక్రమ దందా సాగుతోందని ఇటీవల పోలీసులు తెలిపారు. అంతేకాకుండా నిందితులు ఒక్కో జంతువు నుంచి దాదాపు 1000 మిల్లీ లీటర్ల రక్తం తీస్తున్నారన్నారు. ఒక్కో లీటర్ రూ. 2 వేలకు పైగా ధరకు విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే మటన్ షాపులకు సప్లై చేసే ముందు.. శనివారం అర్ధ రాత్రి, ఆదివారం తెల్లవారుజామున రక్తం తీస్తున్నారని తెలిసింది. కాగా, పోలీసులు స్వాధీనం చేసుకున్న రక్తం ప్యాకెట్లకు.. హ్యూమన్ బ్లడ్ అని లేబుల్ ఉండటంతో.. దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Blood Extraction
  • Goat Sheep
  • hyderabad
  • illegal
  • Kachiguda
  • Racket

Related News

World Ivf Day

IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనడానికి గాంధీ ఆస్పత్రి మరోసారి నిదర్శనంగా నిలిచింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్‌లో ఉచితంగా చికిత్స పొందిన భువనగిరి జిల్లాకు చెందిన ఓ మ‌హిళ పండంటి బాబుకు జన్మనిచ్చింది. రవి, సౌమ్య దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహమైనప్పటి నుంచి సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

  • Ntr Statue Ammerpet

    NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd