సెకండ్ డోస్.. తీసుకోండి బాసూ.. దాదాపు 25 లక్షల మంది దూరం!
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ప్రజలను ఎంతగానో ఇబ్బందులకు గురిచేసింది. కరోనా కారణంగా తమ ఆత్మీయులు, కుటుంబ పెద్దలను కోల్పోయి ఎంతోమంది అనాథలుగా మారారు. వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొవడ్ నివారణలో వ్యాక్సినేషన్ కీలకంగా పనిచేసింది.
- By Balu J Published Date - 01:40 PM, Tue - 12 October 21
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ప్రజలను ఎంతగానో ఇబ్బందులకు గురిచేసింది. కరోనా కారణంగా తమ ఆత్మీయులు, కుటుంబ పెద్దలను కోల్పోయి ఎంతోమంది అనాథలుగా మారారు. వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొవడ్ నివారణలో వ్యాక్సినేషన్ కీలకంగా పనిచేసింది. ఎప్పుడైతే టీకా అందుబాటులోకి వచ్చిందో, అప్పట్నుంచే కొవిడ్ తగ్గుముఖం పట్టింది. ఒకవైపు కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతుండటం, మరోవైపు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో టీకా చాలామంది క్యూ కట్టారు. ఊహించని విధంగా ఫస్ట్ డోస్ తీసుకున్నారు. అయితే సెకండ్ డోస్ కు చాలామంది దూరంగా ఉంటున్నారు. సెకండ్ డోస్ తీసుకోవాల్సిన డేట్ మించిపోతున్నా చాలామంది తీసుకోకవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో దాదాపు 25 లక్షల మంది ఇప్పటివరకు సెకండ్ డోస్ తీసుకోకపోవడం గమనార్హం.
వ్యాక్సినేషన్ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఫస్ట్ డోసు 72 మంది ప్రజలు తీసుకున్నారని, కానీ సెకండ్ డోసుకు చాలామంది దూరంగా ఉన్నారని, వెంటనే తీసుకోవాలని ఆయన కోరారు. పండుగల సీజన్ కారణంగా పబ్లిక్ గ్యాదరింగ్ తో మళ్లీ మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, అర్హులైన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడిన 2.72 కోట్ల ప్రజలకు టీకా ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటికే 2.01 కోట్ల మందికి కనీసం టీకా అందించామని అన్నారు. మొదటి డోస్ తీసుకున్న వారిలో కనీసం 38 శాతం మంది రెండో డోస్ అందుకున్నారని తెలిపారు.
సెప్టెంబర్ 16 న ప్రారంభించిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రకారం.. ప్రతిరోజూ సుమారు మూడు నుండి 3.50 లక్షల మందికి టీకాలు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రెండవ డోస్ తీసుకోనివాళ్లకు, మొదటి డోస్ సైతం తీసుకోనివాళ్ల కోసం ప్రత్యేకంగా ప్రత్యేక టీకాల డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసేందుకు సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, పంచాయత్ రాజ్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. నిన్న సోమవారం నాటికి, రాష్ట్రంలో దాదాపు 30 లక్షల డోస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని, ఎప్పటికప్పడు కేంద్రం తగిన డోసులను అందిస్తుందని వైద్యాధికారి శ్రీనివాసరావు తెలిపారు.
Tags
Related News
Benefits Of MPs: దేశంలో ఎంపీలకు విలాసవంతమైన సౌకర్యాలు, అలవెన్సులు
ఎంపీగా గెలిస్తే ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఎంపీలు నెలవారీ జీతం రూ. 1 లక్ష, అలవెన్సులు సహా. వారి పదవీకాలం తర్వాత పెన్షన్ రూ. 50,000.