HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >20 Chilli Farmers Committed Suicide In Two Months In Mahabubabad District A Report

Farmers Suicide: తెలంగాణలో రాలిపోతున్న రైతన్నలు!

రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, పీఎం కిసాన్ లాంటి పథాకాలేవీ.. అన్నదాతల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి.

  • By Balu J Published Date - 02:26 PM, Wed - 16 March 22
  • daily-hunt
123
123

రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, పీఎం కిసాన్ లాంటి పథాకాలేవీ.. అన్నదాతల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి. టెక్నాలజీ పరుగులు పెడుతున్నా.. ప్రభుత్వాలు మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారింది. పెట్టుబడులు చేతికిరాకపోవడం, ఉన్న అప్పులు పెరిగిపోవడంతో అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్నారు. సాగు చేయలేనంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే గత రెండు నెలల్లో 20 మంది మిర్చి రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడలేక ప్రాణాలు విడిచినట్లు నివేదిక పేర్కొంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల పరిస్థితి ఏం చేయాలో,  ఎటు వెళ్లాలో తెలియక దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. రైతు స్వరాజ్య వేదిక (హ్యూమన్ రైట్స్ ఫోరమ్) కార్యకర్తల బృందం మార్చి 12, 13 రెండు రోజుల క్షేత్ర పర్యటనలో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సముద్రం, మహబూబాబాద్,  దంతాలపల్లి,  మరిపెడ మండలాల్లోని 12 మంది రైతుల కుటుంబాలను ఈ బృందం కలిసి రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడింది.

మహబూబాబాద్, కేసముద్రం మండలాల్లోనే అత్యధిక ఆత్మహత్యలు జరిగాయి. నెల్లికుదురు, డోర్నకల్‌ మండలాల్లో ముగ్గురు చొప్పున ఆత్మహత్యలు చేసుకోగా, దంతాలపల్లి, మరిపెడ మండలాల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ చాలా మంది రైతులు కొన్నేళ్లుగా వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మిర్చి వంటి పంటల పెట్టుబడికి కౌలు మొత్తానికి అదనంగా ఎకరానికి లక్ష అవుతుంది. భారీ వర్షాలు, నల్లరేగడి పురుగుల కారణంగా పంట నష్టపోవడాన్ని జీర్ణించుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అని రైతులను కలిసిన బృందంలో ఒకరైన బి. కొండల్ రెడ్డి వెల్లడించారు. అయితే ప్రతి  కుటుంబం రూ.6 లక్షల నుండి 12 లక్షల మధ్య అప్పులు కలిగి ఉన్నట్లు తేలింది.

దేవిరెడ్డి వెంకట రెడ్డి కుటుంబం మాత్రమే గత 15 సంవత్సరాలుగా సుమారు  20 లక్షల అప్పులను కలిగి ఉంది. మొదటి నుండి ఆ కుటుంబం అప్పుల ఊబి నుండి బయటపడలేకపోయింది. దీంతో వెంకటరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలున్నారు. మహబూబాబాద్ మండలం పర్వతిగిరి గ్రామానికి చెందిన 25 ఏళ్ల నారమళ్ల సంపత్ కుటుంబానిదీ ఇదే పరిస్థితి. ట్రాక్టర్ లోన్ తీసుకుని పొరుగువారి కొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు. పేరుకుపోయిన నష్టాలతో క్రిమిసంహారక మందు తాగి ప్రాణాలు వదిలాడు. అతనికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఈ రైతుల ప్రైవేట్ రుణాలను వన్ టైమ్ సెటిల్‌మెంట్‌గా తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ కుటుంబాలకు ప్రత్యేక పెన్షన్ సౌకర్యం కల్పించాలి అని పలు రైతు సంఘాలు దీనంగా వేడుకుంటున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • farmers struggle
  • Mahabubabad district
  • suicide
  • telangana

Related News

Sadar Sammelan

Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

సదర్ సమ్మేళనం ఉత్సవ ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు.

  • Bandh Effect

    BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

  • Kavitha Bc Bandh

    BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

  • Liquor Shops

    Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!

Latest News

  • Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టులో కీల‌క మార్పు.. వ‌న్డే కెప్టెన్‌గా ఫాస్ట్ బౌల‌ర్‌!

  • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  • Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ

  • Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్‌

  • Venkateswara Swamy: తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఒక్కటి చేయాలి.. లేదంటే యాత్ర అసంపూర్ణమే!

Trending News

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd