5 States Polls : నేరచరిత్ర కలిగిన అభ్యర్థుల్లో తెలంగాణ టాప్ : ఏడీఆర్
5 States Polls : తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ పోల్స్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేరచరిత్రపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా సంచలన నివేదికను విడుదల చేశాయి.
- By Pasha Published Date - 03:40 PM, Tue - 28 November 23
5 States Polls : తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ పోల్స్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేరచరిత్రపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా సంచలన నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం.. ఈ ఐదురాష్ట్రాలను పరిశీలిస్తే తెలంగాణలోనే అత్యధికంగా నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో సగటున 24 శాతం నుంచి 72 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు 45, హత్యాయత్నానికి సంబంధించిన కేసులు 27, హత్య కేసులు 7 ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో 48 శాతం మంది నేర చరిత్ర కలిగి ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. దీని తర్వాతి స్థానాల్లో ఉన్న కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ అభ్యర్థుల్లో ఎక్కువ మందిపై కేసులు ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఐదు రాష్ట్రాల్లో ఇలా..
- మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణల్లో మొత్తం 679 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
- వీటిలో 8,054 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
- ఈ అభ్యర్థుల్లో 18 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
- 12 శాతం మంది అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.
- మొత్తం అభ్యర్థుల్లో 29 శాతం మంది కోటీశ్వరులే. వీరి ఆస్తి సగటున రూ.3.36 కోట్లు ఉంది.
- మిజోరాంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో 3 శాతం నుంచి 10 శాతం మందిపైనే క్రిమినల్ కేసులు ఉన్నాయి. అభ్యర్థులు ఎవరిపైనా మహిళలపై నేరాల కేసులు లేవు.
- అత్యధికంగా 68 శాతం మంది సీపీఎం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 43 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.
- ఐదు రాష్ట్రాల్లోని మొత్తం అభ్యర్థుల్లో 29 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో జాతీయ పార్టీల అభ్యర్థులు 65 శాతం మంది, రాష్ట్ర పార్టీల అభ్యర్థులు 52 శాతం మంది సగటున రూ.1 కోటి కంటే ఎక్కువ ఆస్తులను ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థుల్లో 14 శాతం మందే(5 States Polls) కోటీశ్వరులు.
Related News
JD Lakshmi Narayana Assets: జెడి లక్ష్మీ నారాయణ మొత్తం ఆస్తుల వివరాలు
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ విశాఖపట్నంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన జై భారత్ నేషనల్ పార్టీ తరపున వైజాగ్ నార్త్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. గత ఐదేళ్లుగా తన ఆస్తులు పెరిగాయని లక్ష్మీనారాయణ అఫిడవిట్లో వెల్లడించారు