Xiaomi Mix Fold 3: షావోమి నుంచి మార్కెట్ లోకి మడతపెట్టె ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర
- By Nakshatra Published Date - 07:30 PM, Thu - 6 July 23
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్ లు కలిగిన సరికొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే షావోమి సంస్థ తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. ఫావోమీ మిక్స్ ఫోల్డ్ 3 పేరుతో తీసుకురానున్న ఈ స్మార్ట్ ఫోన్ను ఆగస్టు నెలలో లాంచ్ చేయనున్నారు.
కాగా గతంలో షావోమీ నుంచి విడుదల అయిన మిక్స్ ఫోల్డ్ 2కి అప్డేట్గా ఈ ఫోన్ను లాంచ్ చేయబోతోంది షావోమీ సంస్థ. అయితే ఇప్పటి వరకు ఈ ఫోన్కు సంబంధించి ధర విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనల రాకపోయినప్పటికీ ముందస్తు నివేదికల ప్రకారం కొన్ని ఫీచర్లు వైరల్ అవుతున్నాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఈ స్మార్ట్ ఫోన్లో 6.5 ఇంచెస్ ఔటర్ ప్యానెల్, 8.02 ఇంచెస్ ఫుల్ హెచ్డీ + ఇంటర్నల్ డిస్ప్లేను ఇవ్వనున్నారు. 2400 x 1080 పిక్సెల్ రెజల్యూజన్ ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ తో రానుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ ఎస్ఓసీ ప్రాసెసర్తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ వీ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 16 జీబీ ర్యామ్, 1 టీబీ మెమొరీని అందించనున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్లో 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. ఇందులో 120 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్స్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్తో కూడిన 4800 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఇంకా కొన్ని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే మార్కెట్లో వైరల్ అవుతున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు తెలుసుకున్న వినియోగదారులు ఈ ఫోన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్సిఆర్లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.