Jio New Laptop : 20వేలకే టాప్ క్లాస్ ఫీచర్లతో జియో లాప్ టాప్
Jio New Laptop : స్మార్ట్ ఫోన్ల రంగంలో విప్లవం సృష్టించిన "జియో".. ఇప్పుడు లాప్ టాప్ ల విభాగంపై ఫోకస్ పెట్టింది.
- By Pasha Published Date - 01:27 PM, Mon - 24 July 23
Jio New Laptop : స్మార్ట్ ఫోన్ల రంగంలో విప్లవం సృష్టించిన “జియో”.. ఇప్పుడు లాప్ టాప్ ల విభాగంపై ఫోకస్ పెట్టింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సాప్ట్ వేర్ పై పనిచేసే లాప్ టాప్ ను రూ.20వేలలోపు రేటుకే లాంచ్ చేయబోతోంది. JioBook-2 పేరుతో దీన్ని మార్కెట్ కు పరిచయం చేయబోతోంది. ఇప్పటికే JioBook-1 రిలీజ్ అయింది. సామాన్యులు కూడా కొనగలిగే ధరలో ఈ ఆండ్రాయిడ్ లాప్ టాప్ ను(Jio New Laptop) జూలై 31న మార్కెట్ లోకి రిలీజ్ చేయనున్నారు. బ్లూ కలర్ లో వచ్చే ఈ మినీ లాప్ టాప్ 990 గ్రాముల బరువు ఉంటుంది. ఇది 4G నెట్ వర్క్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఒకసారి బ్యాటరీని ఛార్జింగ్ చేస్తే రోజంతా వర్క్ చేసుకోవచ్చు. ఈమేరకు వివరాలను ఈకామర్స్ వెబ్ సైట్ “అమెజాన్”లో పొందుపరిచారు.
Also read : Manipur Incident: మణిపూర్ ఘటనపై దద్దరిల్లిన రాజ్య సభ
త్వరలో JioBharat 5G హ్యాండ్సెట్..
జియో కంపెనీ ఈ నెల ప్రారంభంలో JioBharat 4G స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. దీని ధర రూ. 999. రాబోయే నెలల్లో JioBharat 5G హ్యాండ్సెట్ను కూడా రిలీజ్ చేయనుంది.
Also read : Raptee Electric Bike: ఇండియా మార్కెట్ లోకి మరో స్పోర్ట్ ఎలక్ట్రిక్ బైక్.. ఆ బైక్ కి పోటీగా రానుందా..?
Related News
Jio Down: దేశంలో డౌన్ అయిన జియో ఇంటర్నెట్ సేవలు..!
జియో (Jio Down) భారతదేశంలోని ప్రసిద్ధ టెలికాం కంపెనీ. దీనికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు. జియో వినియోగదారులు నేడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు.