Twitter: ట్విట్టర్ యూజర్లకు బ్యాడ్ న్యూస్..ఇకపై అందరు డబ్బులు కట్టాల్సిందేనట?
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం లక్షలాది మంది వినియోగదారులు ఈ
- By Nakshatra Published Date - 04:00 PM, Wed - 9 November 22
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం లక్షలాది మంది వినియోగదారులు ఈ ట్విట్టర్ ని వినియోగిస్తూనే ఉన్నారు. కాగా ఈ ట్విట్టర్ యాప్ ని టెస్లా కంపెనీ అధినేత ఎలాంటి మస్క్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ట్విట్టర్ కు సంబంధించిన ఏదో ఒక సంచలన ప్రకటన చేస్తూ వినియోగదారులకు షాకిస్తూనే ఉన్నాడు. ఎంట్రీ ఇవ్వడంతోనే బాత్రూం కమోడ్ పట్టుకొని ట్విట్టర్ ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చిన అతను ట్విట్టర్ కి సంబంధించిన కీలక బాధ్యతలను నిర్వహించే విజయ్ గద్దె, పరాగ్ అగర్వాల్ ని తొలగించాడు.
అంతేకాకుండా ట్విట్టర్ లో పనిచేసే ఉద్యోగులను సగానికి పైగా తొలగించే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అభిమానులకు మరొక షాక్ ఇచ్చాడు ఎలాన్ మస్క్. బ్లూటిక్ దేవల కొనసాగాలి అంతే నెలకు కొంత మొత్తాన్ని డబ్బులు కట్టాలి అంటూ కొత్త రూల్స్ తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. కొత్త కొత్త రూల్స్ తీసుకువస్తూ ఇటు వినియోగదారులను అటు ఉద్యోగులను ఉక్రిబిక్కిరి చేస్తున్నాడు. ఇక మీదట ట్విట్టర్ వాడే వారందరూ కూడా డబ్బులు చెల్లించాల్సిందేనట.
ట్విట్టర్లో కొనసాగాలన్న కొత్తగా ఖాతా తెరవాలి అన్నా కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందేనట. ఇదే విషయం గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని సమాచారం. ఇదే విషయం గురించి కంపెనీలో ఉన్న ఉన్నత ఉద్యోగులతో చర్చించినట్లుగా తెలుస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇకపై ట్విట్టర్ వినియోగం ఫ్రీగా ఉండదట నెలకు కేవలం కొన్ని గంటల వరకు మాత్రమే ట్విట్టర్ ని ఫ్రీగా వాడుకోవచ్చని ఆ తర్వాత వినియోగించాలి అంటే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే అని సమాచారం. ఒకవేళ ఇదే గనుక నిజమైతే వినియోగదారులు ట్విట్టర్ కు బదులుగా ప్రత్యామ్యాయాలు చూసుకుంటారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు.
Related News
Elon Musk Net Worth Rise: మస్క్తో మామూలుగా ఉండదు మరీ.. 5 రోజుల్లో రూ. 3 లక్షల కోట్లు సంపద..!
ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నికర విలువ సోమవారం నాడు 18.5 బిలియన్ డాలర్లు పెరిగింది.