Rishab Panth : టెస్ట్ కెప్టెన్ గా అతనే సరైనోడు : యువీ
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ తో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ శకానికి తెరపడింది. బీసీసీఐ తప్పించకముందే సారథ్యానికి కోహ్లీ గుడ్ బై చెప్పేశాడు. దీంతో అతని అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు.
- By Hashtag U Published Date - 01:10 PM, Tue - 18 January 22
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ తో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ శకానికి తెరపడింది. బీసీసీఐ తప్పించకముందే సారథ్యానికి కోహ్లీ గుడ్ బై చెప్పేశాడు. దీంతో అతని అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. టీ 20 వరల్డ్ కప్ కుముందు మూడు ఫార్మాట్లకు నాయకత్వం వహించిన విరాట్ ఇప్పుడు ఆటగాడిగా గా మాత్రమే జట్టులో కొనసాగనున్నాడు. కాగా కోహ్లీ హఠాత్తుగా తప్పుకోవడంతో ఇప్పుడు అతని స్థానంలో తదుపరి కెప్టెన్ ఎవరనే విషయంపై చర్చ మొదలైంది. ఇప్పటికే టీ20, పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మకే టెస్టు పగ్గాలు కూడా అప్పగించే అవకాశాలు ఉన్నాయని చాలా మంది భావిస్తున్నారు. అయితే వయసు, ఫిట్నెస్ రోహిత్ కు అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా మందీ మాజీ ఆటగాళ్ళు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ కాకుండా కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు జట్టు కెప్టెన్ రేసులో వినిపిస్తున్నాయి. ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కోహ్లి వారసుడిగా షభ్ పంత్ అయితే బాగుంటుందంటున్నాడు.
తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా రిషబ్ పంత్ కే మద్ధతు పలికాడు.రిషబ్ కు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించే విషయమై గవాస్కర్ తో యువీ ఏకీభవించాడు. వికెట్ల వెనక ఉంటూ అతను ఆటను బాగా అధ్యయనం చేస్తాడని, టీమిండియాను మెరుగ్గా ముందుకు నడిపిస్తాడని యువీ వ్యాఖ్యానించాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరు టెస్టులో అందరూ చేతులెత్తేయగా పంత్ సెంచరీతో కదం తొక్కాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలోనూ మెరుపు ఇన్సింగ్స్ లు ఆడి టీమిండియాకు టెస్ట్ సిరీస్ విజయం అందించాడు. అయితే షాట్ల ఎంపికలో కొన్ని సార్లు నిర్లక్ష్యంగా ఆడతాడన్న విమర్శలు పంత్ పై ఉన్నాయి. అనుభవం వచ్చే కొద్దీ నేర్చుకుంటాడని మాజీలు విశ్లేషిస్తున్నారు. కాగా ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను సమర్థవంతంగా లీడ్ చేస్తున్నాడు పంత్.శ్రేయస్ అయ్యర్ స్థానంలో 2021 సీజన్ సారథ్య బాధ్యతలను చేపట్టి పాయింట్ల పట్టికలో ఢిల్లీని అగ్రస్థానానికి తీసుకెళ్లాడు. ఈ అనుభవం కూడా కెప్టెన్సీ రేసులో అతనికి అడ్వాంటేజ్ అవుతుందని యువీ అభిప్రాయపడ్డాడు. అయితే కొంతకాలం వైస్ కెప్టెన్ గా కొనసాగిస్తే రాటు దేలేందుకు వీలుంటుందన్నది మరికొందరి వాదన. ఈ నేపథ్యంలో రోహిత్ కు కొన్నాళ్ళు డిప్యూటీగా పంత్ ను నియమిస్తే ఫ్యూచర్ కెప్టెన్ గా తీర్చిదిద్దే అవకాశముంటుందని వారి అభిప్రాయం. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Related News
Kohli On Impact Player: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై విరాట్ కోహ్లీ అభిప్రాయం ఇదే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చివరి సీజన్ నుండి ఇన్నింగ్స్ మధ్యలో ప్రత్యామ్నాయ ఆటగాడి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రారంభమైంది.