SKY: సూర్య బ్యాటింగ్ కు ఇంగ్లాండ్ ఫిదా
ఇంగ్లాండ్తో మూడో టీ ట్వంటీలో సెంచరీతో రెచ్చిపోయిన సూర్యకుమార్ యాదవ్పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
- By Naresh Kumar Published Date - 06:15 PM, Mon - 11 July 22
ఇంగ్లాండ్తో మూడో టీ ట్వంటీలో సెంచరీతో రెచ్చిపోయిన సూర్యకుమార్ యాదవ్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మిస్టర్ 360 తరహాలో స్టేడియం అన్ని వైపులా షాట్లు కొట్టిన సూర్యకుమార్ బ్యాటింగ్కు ఇంగ్లీష్ బౌలర్లు సైతం ఫిదా అయ్యారు. కీలక బ్యాటర్లు నిరాశపరిచినా.. సూర్యకుమార్ యాదవ్ చివరి వరకూ అద్భుతంగా పోరాడాడు. సెంచరీతో రెచ్చిపోయిన సూర్య బ్యాటింగ్ అభిమానులనే కాదు మాజీలను, విమర్శకులను సైతం ఆకట్టుకుంది. అతని ఆడిన బ్యాటింగ్ తీరుకు భారత్ గెలిచినట్టేనని భావించినా… మరో ఎండ్ నుంచి సపోర్ట్ లేకపోవడంతో సూర్య పోరాటం వృథా అయింది. ఇక ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు సైతం స్కై బ్యాటింగ్కు ఫిదా అయిపోయారు. మూడో టీ ట్వంటీలో ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన పేస్ టాప్లీ సూర్యను ఆకాశానికెత్తాడు.
అతను ఆడిన ఆటకు భారత్ గెలవాల్సిందని అభిప్రాయపడ్డాడు. అతని విభిన్నమైన షాట్లను క్రికెట్ చరిత్రలోనే తాను ఇప్పటివరకు చూడలేదన్నాడు. నిజానికి ఈ మ్యాచ్లో సూర్యకుమార్ మిస్టర్ 360 డివీలియర్స్ తరహాలో అన్ని షాట్లూ ఆడాడు. స్టేడియం నలువైపులా అద్భుతమైన షాట్లతో చెలరేగిపోయాడు. ‘అతను ఆ షాట్స్ ఎలా ఆడాడని ఇప్పటికీ తనకు అంతుపట్టడం లేదని టోప్లీ చెప్పుకొచ్చాడు. పూర్తి బ్యాటింగ్ వికెట్ అయినప్పటకీ అన్ని విభిన్నమైన షాట్లు కొట్టడం అంత సులభం కాదని ప్రశంసించాడు. ఒక్క ఓవర్ గాడితప్పి ఉంటే సూర్యకుమార్ భారత్ను గెలిపించే వాడని టోప్లీ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో విన్నింగ్ ప్రదర్శన చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు. కాగా మూడో టీ ట్వంటీలో మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ భారీస్కోర్ చేసింది. ఛేజింగ్లో భారత్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది.
రోహిత్, కోహ్లీ, పంత్ , అయ్యర్ విఫలమవగా… సూర్యకుమార్ మాత్రం చివరి వరకూ పోరాడాడు. 48 బంతుల్లోనే సెంచరీ చేసినా సహచరుల నుంచి మద్ధతు కరువైంది. దీంతో భారత్ చివరి వరకూ పోరాడి ఓడింది. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 117 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ ట్వంటీల్లో అతనికి ఇదే తొలి శతకం.
Related News
MI vs DC: రోహిత్ హాఫ్ సెంచరీ మిస్.. నిరాశపరిచిన సూర్య
ఐపీఎల్ 20వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో తలపడుతోంది. వాంఖడే మైదానంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో తొలి విజయం కోసం ముంబై ఇంకా ఎదురుచూస్తోంది