Virat Kohli: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విరాట్ కోహ్లీ పదవ తరగతి మార్కుల లిస్ట్.. మీరు చూశారా?
సాధారణంగా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎంతమంది ఉంటారో క్రికెట్ ని కూడా ఇష్టపడే ప్రేక్షకులు అంతకంటే
- By Nakshatra Published Date - 03:03 PM, Thu - 30 March 23
సాధారణంగా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎంతమంది ఉంటారో క్రికెట్ ని కూడా ఇష్టపడే ప్రేక్షకులు అంతకంటే ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. క్రికెటర్లలో అత్యంత ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్న వారిలో టీం ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఒకరు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులకు విరాట్ కోహ్లీ సుపరిచితమే. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ 2023 రేపు అనగా మార్చి 31వ తేదీ నుంచి మొదలుకానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఏప్రిల్ లో మొదలై మే వరకు దాదాపు రెండు నెలల పాటు ఈ ఐపిఎల్ 2023 మ్యాచులు జరగనున్నాయి.
ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. ఇది ఇలా ఉంటే విరాట్ కోహ్లీ ఐపిఎల్ 2023 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున 16 సీజన్ సిద్ధంగా ఉన్నాడు. మొదట 19 ఏళ్ల వయసులోని 2008లో ఆర్సిబి తో జట్టు కట్టిన విరాట్ కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ కప్ ను కూడా దక్కించుకోలేకపోయాడు. అయితే ఈసారైనా టైటిల్ విజేతగా నిలవాలి అని బెంగళూరు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక రేపటి నుంచి ఐపీఎల్ 2023 మొదలవుతుంది అన్న హంగామా లో ఉన్నారు క్రికెట్ ప్రేమికులు.
ఈ నేపథ్యంలోనే తాజాగా అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా విరాట్ కోహ్లీ తన పదవ తరగతి మార్కుల జాబితాను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్పోర్ట్స్ అంటూ క్యాప్షన్ ని కూడా జోడించాడు. ఆ పదవ తరగతి మార్క్స్ షీట్ లో విరాట్ కోహ్లీ 2004లోనే పదవ తరగతి పాస్ అయినట్లు ఉంది. ఇక అందులో వచ్చిన మార్కుల విషయానికి వస్తే..ఇంగ్లీషులో 83 మార్కులు రాగా హిందీలో 75, సోషల్ లో 81, మాథ్స్ లో 51, సైన్స్ లో 55 మార్కులు వచ్చాయి. ఇక అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ స్పోర్ట్స్ గురించి స్పందిస్తూ మార్కుల జాబితాలో కనీసం చోటు లేని సబ్జెక్టు ఇప్పుడు ఎక్కువ భాగం అవ్వడం విశేషంగా ఉంది అని రాసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Related News
RCB vs CSK: రికార్డులు బద్దలుకొట్టిన ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్.. 50 కోట్లకు పైగా వీక్షకులు..!
బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో మే 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది.