Road Safety World Series FINAL:లెజెండ్స్ టోర్నీ విజేత ఎవరో ?
- By Naresh Kumar Published Date - 03:17 PM, Sat - 1 October 22
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 సీజన్ తుది అంకానికి చేరింది. ఇవాళ జరిగే ఫైనల్లో ఇండియా లెజెండ్స్ , శ్రీలంక లెజెండ్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే రెండు జట్లూ ఈ సీజన్ లో ఓటమి ఎరుగవు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ గ్రూప్ స్టేజీలో 2 మ్యాచ్ లు గెలవగా.. మరో 3 మ్యాచ్ లు వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యాయి. అలాగే టేబుల్ టాపర్గా నిలిచిన శ్రీలంక లెజెండ్స్ కూడా , గ్రూప్ స్టేజీలో 5 మ్యాచులు ఆడి 4 విజయాలు అందుకుంది. మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయ్యింది.
ఇదిలా ఉంటే మొదటి సెమీ ఫైనల్లో ఇండియా లెజెండ్స్ ,ఆస్ట్రేలియా లెజెండ్స్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని ఫైనల్ చేరింది. మరో సెమీ ఫైనల్లో శ్రీలంక వెస్టిండీస్ పై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత జట్టులో సచిన్ , నమన్ ఓజా, పఠాన్ బ్రదర్స్ తో పాటు స్టువర్ట్ బిన్నీ సూపర్ ఫామ్ లో ఉన్నారు. సురేష్ రైనా, యువరాజ్ సింగ్ మెరుపులు పూర్తి స్థాయిలో అభిమానులు చూడలేదు. దీంతో తుది పోరులో వీరిద్దరూ కూడా రాణిస్తే ఇండియా లెజెండ్స్ కు తిరుగుండదు. మరోవైపు లంక లెజెండ్స్ టీమ్ లో ఉపుల్ తరంగా, చమర సిల్వా, జీవన్ మెండిస్, ఉదాన, కులశేఖర కీలకం కానున్నారు.
Tags
Related News
Sachin Tendulkar: సచిన్ టెండూలర్కర్ ఎమోషనల్ ట్వీట్.. ఎల్లప్పుడూ కృతజ్ఞుడనని నోట్..!
2 ఏప్రిల్ 2011 తేదీని ఏ భారతీయుడు మరచిపోలేడు. MS ధోని ఐకానిక్ సిక్స్తో టీమ్ ఇండియా ICC వరల్డ్ కప్ 2011 టైటిల్ను గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమ్ ఇండియా తొలి ప్రపంచకప్ గెలిచింది. అప్పటికి సచిన్ టెండూల్కర్ వయసు 10 ఏళ్లు.