Martin Guptill: ధోనీ వల్ల ఇప్పటికి బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి.. కివీస్ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
వెటరన్ న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ (Martin Guptill) షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. మహేంద్ర సింగ్ ధోనీ వల్లే తనకు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయని మార్టిన్ గప్టిల్ చెప్పాడు.
- By Gopichand Published Date - 03:15 PM, Sun - 26 November 23
Martin Guptill: వెటరన్ న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ (Martin Guptill) షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. మహేంద్ర సింగ్ ధోనీ వల్లే తనకు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయని మార్టిన్ గప్టిల్ చెప్పాడు. గప్టిల్ ను చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు. 2023 లెజెండ్స్ లీగ్ క్రికెట్ డెహ్రాడూన్ దశలో గప్టిల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. గప్టిల్ అర్బన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో భాగం. అయితే గప్టిల్ వెల్లడించిన విషయాలు వెటరన్ క్రికెటర్లు, లక్షలాది క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేశాయి.
గప్టిల్ కు బెదిరింపు మెయిల్ ఎందుకు వచ్చింది?
ఐసీసీ వరల్డ్ కప్ 2019 సెమీ ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో భారత్ సులువుగా గెలిచేది. అయితే చివరలో మహేంద్ర సింగ్ ధోనిని మార్టిన్ గప్టిల్ రనౌట్ చేశాడు. ధోని ఔటైన తర్వాత టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది. దీనితో తర్వాత భారత్ ప్రపంచకప్ నుండి నిష్క్రమించింది. గప్టిల్ చేతిలో ధోని రనౌట్ అయ్యాడు. అందుకే ఈ ఓటమికి భారత క్రికెట్ అభిమానులు గప్టిల్ను బాధ్యుడుగా భావించారు.
Also Read: India Head Coach: భారత జట్టుకు కొత్త కోచ్.. భారతీయుడు కాదు విదేశీ ఆటగాడు..?!
గప్టిల్ పై టీమిండియా అభిమానులు ఫైర్
భారత్ ఓటమి తర్వాత కూడా అభిమానులు మార్టిన్ గప్టిల్ను తీవ్రంగా తిట్టారు. సోషల్ మీడియాలో గప్టిల్ను అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు. దీన్ని బట్టి 2019 వరల్డ్ కప్ లో భారత్ ఓటమి అభిమానులను ఎంతగా కుంగదీసిందో అంచనా వేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులు ఇప్పటికీ ఆ ఓటమిని మరిచిపోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని మార్టిన్ ప్రస్తావించాడు. అందుకే ధోనిని ఎందుకు రనౌట్ చేశావంటూ గప్టిల్కు ఇప్పటికీ బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. సెమీఫైనల్లో భారత్ ఓడిన తర్వాత మెయిల్స్ వచ్చేవని, అయితే ఇప్పటికి బెదిరింపు మెయిల్స్ వస్తూనే ఉన్నాయని గప్టిల్ చెప్పాడు.
We’re now on WhatsApp. Click to Join.
Related News
Disney+ Hotstar: టీమిండియా క్రికెటర్లే కాదు అభిమానులు కూడా చరిత్ర సృష్టించారు.. ఏ విషయంలో అంటే..?
వాస్తవానికి సెమీ-ఫైనల్ మ్యాచ్ సమయంలో డిస్నీ ప్లస్ హాట్స్టార్ (Disney+ Hotstar)లో భారతీయ ప్రేక్షకులు ప్రత్యక్ష ప్రసార వీక్షకుల రికార్డును కూడా సృష్టించారు.