Rishabh Pant: వచ్చే ఐపీఎల్ కు రిషబ్ పంత్ రెడీ: సౌరవ్ గంగూలీ
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్లో ఆడతాడని ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ తెలిపారు.
- By Gopichand Published Date - 09:56 AM, Sat - 11 November 23
Rishabh Pant: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్లో ఆడతాడని ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ తెలిపారు. గతేడాది డిసెంబర్లో జరిగిన కారు ప్రమాదంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్లో జరిగిన శిక్షణా సెషన్లో పంత్ ఆటగాళ్లతో చేరాడు.
పంత్ గురించి తాజా సమాచారం ఇస్తూ గంగూలీ విలేకరులతో మాట్లాడుతూ.. “అతను (పంత్) ఇప్పుడు బాగానే ఉన్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడనున్నాడు. రిషబ్ ఇక్కడ ప్రాక్టీస్ చేయడు. సాధన ప్రారంభించడానికి సమయం పడుతుంది. జనవరి నాటికి (2024 నాటికి) ఇది మరింత మెరుగుపడుతుంది” అని పేర్కొన్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
గంగూలీ మాట్లాడుతూ.. మేము జట్టు గురించి మాట్లాడుతున్నాము. అతను కెప్టెన్ కాబట్టి త్వరలో జరగనున్న వేలానికి సంబంధించి తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఈ కారణంగా అతను ఇక్కడకు వచ్చాడు. తద్వారా బృందం కొన్ని సంబంధిత అంశాలను ఖరారు చేసిందని గంగూలీ తెలిపాడు. గతేడాది డిసెంబర్లో మిర్పూర్లో బంగ్లాదేశ్తో పంత్ తన చివరి టెస్టు ఆడాడు.
Also Read: Anushka Sharma: మళ్లీ గర్భం దాల్చిన అనుష్క శర్మ..? బేబీ బంప్తో వీడియో వైరల్..!
30 డిసెంబర్ 2022 ఉదయం రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్కు గురయ్యాడు. ఆ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అక్కడున్న స్థానికులు పంత్ను కారులోంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రారంభ రోజుల్లో అతను డెహ్రాడూన్లోని ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అనంతరం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఇప్పుడు పంత్ పూర్తిగా ఫిట్గా ఉన్నాడు. తన పునరావాస ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు.
IPL 2023లో పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ను ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా నియమించారు. కానీ జట్టు రాణించలేకపోయింది. గాయం నుండి తిరిగి వచ్చిన తర్వాత పంత్ ఢిల్లీకి పాత ఢిల్లీ రూపాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. రిషబ్ పంత్ 2024 IPLకి ముందు పూర్తిగా ఫిట్గా ఉంటాడు. ఆ తర్వాత అతను భారత జట్టులో ఎంపికకు కూడా అందుబాటులో ఉంటాడు.
Related News
MI vs KKR: 12 ఏళ్ల తర్వాత వాంఖడేలో ముంబైపై కేకేఆర్ విజయం
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ ముంబై ఇండియన్స్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో 9 మ్యాచ్ల్లో భారీగా పరుగులు ఇచ్చిన స్టార్క్ 10వ మ్యాచ్లో ముంబైపై మెరిశాడు. 24.75 కోట్లతో ఐపీఎల్ లో అడుగుపెట్టిన మిచెల్ స్టార్క్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి ముంబై బ్యాటర్లను వణికించేశాడు.