HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Richa Ghoshs Late Charge Goes In Vain India Lose First Match In World Cup

T20 World Cup: మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్… ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత్ కు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి జోరుమీదున్న హర్మన్ ప్రీత్ సేన ఇంగ్లాండ్ చేతిలో 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

  • By Naresh Kumar Published Date - 10:45 PM, Sat - 18 February 23
  • daily-hunt
Smriti
Smriti

T20 Women’s World Cup:  దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత్ కు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి జోరుమీదున్న హర్మన్ ప్రీత్ సేన ఇంగ్లాండ్ చేతిలో 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ కు దిగిన 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. నిజానికి పవర్ ప్లేలోనే ఇంగ్లాండ్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ వ్యాట్ డకౌటవగా.. డంక్లీ 10 , క్యాప్సీ 3 పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో బ్రంట్ , హీదర్ నైట్ , వికెట్ కీపర్ జోన్స్ ఇంగ్లాండ్ ను ఆదుకున్నారు. కీలక సమయంలో వీరి పార్టనర్ షిప్ ఆ జట్టుకు మంచి స్కోర్ అందించింది. బ్రంట్ 50 , జోన్స్ 40 , నైట్ 28 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ అద్భుతమైన గణాంకాలు నమోదు చేసింది. 4 ఓవర్లలో 15 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది.

152 పరుగుల లక్ష్య ఛేదనలో భారత మహిళల జట్టు త్వరగానే ఓపెనర్ షెఫాలీ వర్మ వికెట్ కోల్పోయింది. స్మృతి మంధాన ధాటిగా ఆడినప్పటకీ… మరో ఎండ్ లో వరుసగా రోడ్రిగ్స్ , కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఔటవడం దెబ్బతీసింది. అయితే రిఛా ఘోష్ తన ఫామ్ కొనసాగించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. స్మృతి , రిఛా ఘోష్ 43 పరుగులు జోడించారు.స్లాగ్ ఓవర్లలో వరుస వికెట్లు మరోసారి భారత్ విజయావకాశాలను దెబ్బతీశాయి. స్మృతి మంధాన 41 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 52 పరుగులకు చేయగా…రిఛా ఘోష్ 47 రన్స్ తో చివరి వరకూ నాటౌట్ గా నిలిచినా ఫలితం లేకపోయింది. చివర్లో ఇంగ్లాండ్ బౌలర్లు భారత్ ను కట్టడి చేశారు. ఫలితంగా భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 140 పరుగులే చేయగలిగింది. భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ ఐర్లాండ్ తో ఫిబ్రవరి 20న తలపడుతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • India vs England
  • Richa Ghosh
  • smriti mandana
  • T20 womens' world cup

Related News

    Latest News

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    Trending News

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd