HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Reports Bcci Planning To Host Entire Ipl 2022 In Maharashtra

IPL 2022 : మహారాష్ట్రలో ఐపీఎల్ 2022 ?

దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతుండడంతో పలు రాష్ట్రాలు ఆంక్షల వలయంలోకి వెళ్ళిపోయాయి. నైట్ కర్ఫ్యూ , వీకెండ్ కర్ఫ్యూ. వంటి నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్ భారత్ లో జరుగుతుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.

  • By Hashtag U Published Date - 12:06 PM, Tue - 11 January 22
  • daily-hunt
Ipl Vivo
Ipl Vivo

దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతుండడంతో పలు రాష్ట్రాలు ఆంక్షల వలయంలోకి వెళ్ళిపోయాయి. నైట్ కర్ఫ్యూ , వీకెండ్ కర్ఫ్యూ. వంటి నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్ భారత్ లో జరుగుతుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కరోనా కారణంగానే గత రెండేళ్ళూ విదేశాల్లో నిర్వహించిన బీసీసీఐ ఈ సారి మాత్రం స్వదేశంలోనే లీగ్ జరిపించాలని పట్టుదలగా ఉంది. దీని కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. కోవిడ్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఒకే చోట ఐపీఎల్ మ్యాచ్ లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మహారాష్ట్రనే మంచి వేదికగా భావిస్తున్న బోర్డు ఇప్పటికే అక్కడి అసోసియేషన్లతో మాట్లాడింది. ఎంసిఎతో మాట్లాడిన బీసీసీఐ అధికారులు ఎన్సీపీ నేత శరద్ పొవార్ తోనూ చర్చించారు.

వచ్చే వారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేను కూడా కలిసి ఈ ప్రతిపాదన గురించి చెప్పనున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ఈ సారి ఐపీఎల్ పూర్తి సీజన్ కు మహారాష్ట్ర వేదికవుతుంది. ముంబైలోని వాంఖేడే, బ్రౌబర్న్ , డివై పాటిల్ స్టేడియాలతో పాటు పుణేలోని ఎంసీఎ స్టేడియంలో మ్యాచ్ ల నిర్వహణకు ప్రణాళికలు రచిస్తోంది. ఒకే రాష్ట్రంలో నిర్వహిస్తే బయోబబూల్ ను ఏర్పాటు చేయడం సులభతరం అవుతుందనేది బోర్డు ఆలోచన. అలాగే ప్రేక్షకులు లేకుండానే టోర్నీ నిర్వహించే పరిస్థితి ఉండడంతో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తవని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై త్వరలోనే పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అయితే ఏప్రిల్ సమయానికి కరోనా కేసులు తగ్గుముఖం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ళ మెగా వేలం ముగిసిన తర్వాత ఐపీఎల్ వేదిక, షెడ్యూల్ వంటి వాటిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2022

Related News

    Latest News

    • Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో తొలి దశ ప్రభుత్వానికి.. ఎల్‌అండ్‌టీ నుంచి పూర్తిస్థాయి స్వాధీనం

    • Man Ate Spoons: స్పూన్లు, టూత్‌ బ్రష్‌లు మింగిన వ్యక్తి: రిహాబ్‌ సెంటర్‌పై కోపంతో అర్థంలేని పని

    • Parijata: పారిజాత పూల రహస్యం: ఈ పుష్పాలను ఎవరు కోయకూడదో ఎందుకు తెలుసా?

    • SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్

    • Car Brands Logo: సుజుకి కొత్త లోగో.. డిజిటల్ యుగంలో ఆటోమొబైల్ బ్రాండ్ల కొత్త వ్యూహం!

    Trending News

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

      • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

      • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

      • Gold Rate Hike: బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయా? పెరుగుతాయా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd