PT Usha President of IOA : భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష..!!
- By hashtagu Published Date - 06:51 AM, Mon - 28 November 22
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా లెజెండరీ స్ప్రింటర్ పీటీ ఉష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐఓఏ 95 ఏళ్ల చరిత్రలో అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఒలింపియన్ పీటీ ఉష. దేశంలోనే అత్యంత విజయవంతమైన అథ్లెట్లలో ఒకరు. ఆసియా క్రీడల్లో 4 స్వర్ణాలతోపాటు 11 పతకాలను గెలుచుకుంది ఉష. ఈ ఏడాది రాజ్యసభకు కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే.
ఐఓఏ ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలు గడువు 27 ఆదివారంతో ముగిసింది. అధ్యక్ష పదవికి పీటీ ఉష మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యింది. 95ఏళ్ల భారత ఒలింపిక్ చరిత్రలోనే అధ్యక్షపదవి చేపట్టి తొలి ఒలింపియన్ గా ఉష చరిత్రలోకి ఎక్కారు. దీంతో పాటు మహారాజా యద్వీందర్ సింగ్ తర్వాత అధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి క్రీడాకారిణి ఉష. యద్వీందర్ 1934లో టెస్ట్ మ్యాచ్ ఆడారు. 1938లో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
Heartfelt thanks to my team for their unconditional trust and support 🙏🏻 pic.twitter.com/djr1rR9rG9
— P.T. USHA (@PTUshaOfficial) November 27, 2022
కాగా ఐఓఏ చీఫ్ గా ఎన్నికైన పీటీ ఉషను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. కిరన్ రిజిజు ట్వీట్ చేస్తూ…భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు పీటీ ఉషకు అభినందనలు. మనదేశంలోని క్రీడా హీరోలందరినీ అభినందిస్తున్నా. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందంటూ ట్వీట్ చేశారు.
Congratulations to legendary Golden Girl, Smt. P T Usha on being elected as the President of Indian Olympic Association. I also congratulate all the sporting heroes of our country on becoming the office bearers of the prestigious IOA! Nation is proud of them ! pic.twitter.com/LSHHdmMy9H
— Kiren Rijiju (@KirenRijiju) November 27, 2022
Related News
PT Usha: పీటీ ఉష సరికొత్త రికార్డు.. IOA తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక
భారత క్రీడా పరిపాలనలో కొత్త శకానికి నాంది పలికిన లెజెండరీ స్ప్రింటర్ పిటి ఉష (PT Usha) శనివారం భారత ఒలింపిక్ సంఘం (IOA) తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 58 ఏళ్ల పిటి ఉష (PT Usha) ఆసియా క్రీడలలో బహుళ పతకాలను గెలుచుకుంది. 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ క్రీడలలో 400 మీటర్ల హర్డిల్స్లో నాల్గవ స్థానంలో నిలిచింది. అత్యున్నత పదవికి ఎన్నికైంది. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.