HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Pm Modi Meet Olympic Athletes 15 August

PM Modi Meet Athletes: భార‌త అథ్లెట్ల‌తో ప్ర‌ధాని మోదీ..!

ఎర్రకోటలో తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత ప్రధాని మోదీ తన నివాసంలో ఒలింపిక్ అథ్లెట్లందరితో సమావేశం కానున్నారు.

  • Author : Gopichand Date : 15-08-2024 - 9:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Modi
PM Modi

PM Modi Meet Athletes: ప్రధాని నరేంద్ర మోదీ 15 ఆగస్టు 2024న అంటే భారతదేశ 78వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రత్యేక సందర్భంలో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న‌ 117 మంది అథ్లెట్లతో కూడిన భారత బృందంతో ప్రధాని మోదీ (PM Modi Meet Athletes) సమావేశం కానున్నారు. పతక విజేతలతో సహా క్రీడాకారులందరికీ ఆహ్వానాలు పంపారు. ఇది మాత్రమే కాదు మొత్తం భారత బృందాన్ని కూడా ప్రధానమంత్రి నివాసాన్ని సందర్శించాలని ఆహ్వానించారు.

ఎర్రకోటలో తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత ప్రధాని మోదీ తన నివాసంలో ఒలింపిక్ అథ్లెట్లందరితో సమావేశం కానున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020 టోక్యో ఒలింపిక్ క్రీడలు 2021లో నిర్వ‌హించారు. ఇక్కడ భారత జట్టు మొత్తం 7 పతకాలను గెలుచుకుంది. ఆ సమయంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం ఒలింపిక్ బృందంతో ప్రత్యేకంగా సమావేశమై ఆటగాళ్లతో విందు కూడా చేశారు.

Also Read: PM Modi : భారతీయులంతా తలుచుకుంటే వికసిత భారత్ సాధ్యమే : ప్రధాని మోడీ

2021లో టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన అథ్లెట్లందరితో ప్రధాని మోదీ డిన్నర్ చేశారు. ఈసారి తన ప్రసంగం ముగించుకుని 12 గంటల తర్వాత అథ్లెట్లతో ప్రధాని భేటీ కానున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రధానమంత్రి భారత జట్టులోని అథ్లెట్లందరితో కలిసి భోజనం చేయవచ్చు. టీ సిప్ చేస్తూ చూడవచ్చు. చివరిసారిగా ప్రధాని మోదీ అథ్లెట్లను కలిసినప్పుడు వారి ఫొటోలు చర్చనీయాంశమయ్యాయి. నీరజ్ చోప్రా నుండి జావెలిన్ త్రో గురించి అడిగి తెలుసుకున్నారు.

117 మంది అథ్లెట్లతో కూడిన భారత బృందం ఒలింపిక్స్‌లో పాల్గొంది

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. షూటింగ్‌లో భారత్ అత్యధిక పతకాలు సాధించింది. షూటింగ్‌లో మను భాకర్ 1 కాంస్యం, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్ కూడా మనుతో కలిసి కాంస్యాన్ని పంచుకున్నారు. స్వప్నిల్ కుసాలే తన ఒలింపిక్ అరంగేట్రంలోనే కాంస్య పతకాన్ని కూడా సాధించాడు. వీరితో పాటు రెజ్లింగ్, భారత హాకీ జట్టు కాంస్యం సాధించారు. భారత్‌కు రజత పతకాన్ని తెచ్చిపెట్టిన ఏకైక అథ్లెట్ నీరజ్ చోప్రా. ఈ క్రీడాకారులందరికీ ప్రధాని మోదీ ఫోన్ లేదా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • independence day
  • Olympic Athletes
  • Paris Olympics 2024
  • pm modi
  • sports news

Related News

PM Modi

11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారమైన ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ లభించింది. ఇథియోపియా ప్రధానమంత్రి డాక్టర్ అబీ అహ్మద్ ఈ గౌరవాన్ని ప్రధానికి అందజేశారు.

  • Pakistan

    పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు.. కోచ్‌ను తొల‌గించిన పీసీబీ!

  • Varun Chakravarthy

    చ‌రిత్ర సృష్టించిన టీమిండియా బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి!

  • Oman

    ఒమన్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ క‌రెన్సీ విశేషాలీవే!

  • KKR Captain

    కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

Latest News

  • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

  • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

  • AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

  • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

  • తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd