PBKS vs GT: ఐపీఎల్ లో నేడు రసవత్తర పోరు.. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్…!
IPL 2023 18వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరగనుంది. ఇరు జట్లూ తమ చివరి మ్యాచ్లో ఓడిన తర్వాత బరిలోకి దిగుతున్నాయి.
- By Gopichand Published Date - 08:55 AM, Thu - 13 April 23
IPL 2023 18వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరగనుంది. ఇరు జట్లూ తమ చివరి మ్యాచ్లో ఓడిన తర్వాత బరిలోకి దిగుతున్నాయి. రింకూ సింగ్ అద్భుత బ్యాటింగ్తో కేకేఆర్ చేతిలో గుజరాత్ టైటాన్స్ పరాజయం పాలైంది. అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ టోర్నీలో పంజాబ్ను ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరగనుంది. పంజాబ్ కింగ్స్ ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు గెలుపొందగా, ఒక మ్యాచ్లో ఓటమిని చవిచూసింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ రెండు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్లో ఓడిపోయింది.
గత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ కింగ్స్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 143 పరుగులు చేయగా, హైదరాబాద్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. మరోవైపు గత మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 204 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా KKR బ్యాట్స్ మెన్ రింకూ సింగ్ చివరి ఓవర్లో 5 సిక్సర్లు కొట్టి మ్యాచ్ గతిని మార్చేసి KKRకు విజయం అందించాడు.
మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియం అత్యధిక స్కోరింగ్కు ప్రసిద్ధి. స్లో పిచ్పై బ్యాట్స్మెన్ పరుగులు చేయడం సులభం. పాత మ్యాచ్లను పరిశీలిస్తే.. ఛేజింగ్ జట్టుకే ఇక్కడ ప్రయోజనం చేకూరింది. అలాగే ఈ పిచ్లో అత్యుత్తమ స్కోరు 180.
Also Read: Jos Buttler: ఐపీఎల్ లో జోస్ బట్లర్ అరుదైన ఘనత.. వార్నర్, డుప్లెసిస్ రికార్డులు బ్రేక్ చేసిన బట్లర్
పంజాబ్, గుజరాత్ జట్లు ఇప్పటి వరకు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్లు 2022లో జరిగాయి. ఒక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందగా, ఒక మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీన్ని బట్టి ఏ జట్టు పైచేయి సాధిస్తుందో ఊహించలేం. అయితే.. ప్రస్తుతం జట్ల పరంగా పంజాబ్ కంటే గుజరాత్ టైటాన్స్ కాస్త బలంగా కనిపిస్తోంది.
ఈ టోర్నీలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో 225 పరుగులు చేశాడు. గత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై 99 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఏడాది అతనితో స్ట్రైక్ రేట్ సమస్య లేదు. అతను దాదాపు 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు అతను మొత్తం 27 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు.
Related News
GT vs RCB: చితక్కొట్టిన సాయి సుదర్శన్.. నిరాశపరిచిన గిల్
సాయి సుదర్శన్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో మిల్లర్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.