Pakistani Cricketers: ఒడిశా రైలు ప్రమాదం.. విచారం వ్యక్తం చేసిన పాక్ ఆటగాళ్లు
ఇప్పుడు ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు (Pakistani Cricketers) విచారం వ్యక్తం చేశారు. ఇందులో మహ్మద్ రిజ్వాన్, హసన్ అలీ పాల్గొన్నారు.
- By Gopichand Published Date - 12:08 PM, Tue - 6 June 23

Pakistani Cricketers: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం భారత్తో పాటు ప్రపంచ ప్రజలను వణికించింది. ఈ ఘోర ప్రమాదంలో మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 280 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1100 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పుడు ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు (Pakistani Cricketers) విచారం వ్యక్తం చేశారు. ఇందులో మహ్మద్ రిజ్వాన్, హసన్ అలీ పాల్గొన్నారు.
మహ్మద్ రిజ్వాన్ ట్వీట్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు
ఒడిశా రైలు ప్రమాదంపై పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహ్మద్ రిజ్వాన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో రిజ్వాన్ ఈ విధంగా రాసుకొచ్చాడు. మనిషి ప్రాణాలు కోల్పోవడం ఎప్పుడూ బాధాకరమే. భారతదేశంలో జరిగిన రైలు ప్రమాదంలో బాధిత ప్రజలకు నా ప్రార్థనలు ఉన్నాయని రిజ్వాన్ ట్వీట్లో పేర్కొన్నాడు.
Also Read: WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీ ఎంత..? ఫైనల్ డ్రా అయితే విజేత ఎవరు..?
హసన్ అలీ సంతాపం
ఒడిశా రైలు ప్రమాదంపై పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ విచారం వ్యక్తం చేశాడు. ట్వీట్లో విచారం వ్యక్తం చేస్తూ.. భారతదేశంలో జరిగిన రైలు సంఘటన గురించి విని చాలా బాధపడ్డాను. ఆత్మీయులను కోల్పోయిన వారందరికీ అల్లా ధైర్యాన్ని ప్రసాదించుగాక అని రాసుకొచ్చాడు.
మహ్మద్ రిజ్వాన్, హసన్ అలీల ఈ ట్వీట్లపై ప్రజలు ఈ ఇద్దరు పాక్ క్రికెటర్లను ప్రశంసించారు. ఒక యూజర్ “లవ్ యు రిజ్వాన్ భాయ్” అని వ్యాఖ్యానించారు. రిజ్వాన్ ట్వీట్ను మరో వినియోగదారు ‘ట్వీట్ ఆఫ్ ది డే’ అని పిలిచారు. అదేవిధంగా హసన్ అలీ ట్వీట్పై పలువురు అభిమానులు స్పందించారు.
పలువురు భారతీయులు కూడా సంతాపం
ఈ ప్రమాదంపై విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్ సహా పలువురు క్రీడా దిగ్గజాలు విచారం వ్యక్తం చేశారు. భారత మాజీ వెటరన్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్, విచారం వ్యక్తం చేయడంతో పాటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు తన పాఠశాలలో ఉచిత విద్యను అందించడం గురించి కూడా మాట్లాడాడు.