IPL Mini Auction: ఐపీఎల్ మినీ వేలంలో 77 మంది ఆటగాళ్లకే ఛాన్స్..!
ఐపీఎల్ 2024 మినీ వేలం (IPL Mini Auction) కోసం ఆటగాళ్ల జాబితాను ఖరారు చేశారు. ఈ వేలం కోసం 1166 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 333 మంది పేర్లు ఎంపికయ్యాయి.
- By Gopichand Published Date - 07:11 AM, Tue - 12 December 23
IPL Mini Auction: ఐపీఎల్ 2024 మినీ వేలం (IPL Mini Auction) కోసం ఆటగాళ్ల జాబితాను ఖరారు చేశారు. ఈ వేలం కోసం 1166 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 333 మంది పేర్లు ఎంపికయ్యాయి. ఈ 333 మంది ఆటగాళ్ల వేలం డిసెంబర్ 19న దుబాయ్లో జరగనుంది. వీరిలో కేవలం 77 మంది ఆటగాళ్లకే అదృష్టం వరిస్తుంది. ఎందుకంటే 10 ఫ్రాంచైజీలు మొత్తం 77 అందుబాటులో ఉన్న స్లాట్లను మాత్రమే కలిగి ఉన్నాయి.
333 మంది పేర్లను ఖరారు చేయగా.. అందులో 214 మంది భారత ఆటగాళ్లు కాగా, 119 మంది ఆటగాళ్లు విదేశీయులు ఉన్నారు. ఈ సంఖ్యలో విదేశీ ఆటగాళ్లలో అసోసియేట్ దేశాలకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు కూడా ఉన్నారు. అత్యధిక బేస్ ధర 2 కోట్లు. ఈ విభాగంలో 23 మంది ఆటగాళ్లు ఉన్నారు. దీని తర్వాత 13 మంది ఆటగాళ్లను రూ. 1.5 కోట్ల ప్రాథమిక ధరలో పేర్కొన్నారు. అదేవిధంగా రూ.1 కోటి ప్రాథమిక ధరలో 14 మంది ఆటగాళ్లు, రూ.75 లక్షల బ్రాకెట్లో 11 మంది ఆటగాళ్లు ఉన్నారు.
Also Read: IPL 2024 Mini-Auction Player List : ఐపీఎల్ మినీ వేలం షార్ట్ లిస్ట్ రెడీ…బరిలో 333 మంది ప్లేయర్స్
2 కోట్ల బేస్ ధరలో ముగ్గురు భారత ఆటగాళ్లు
హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ పేర్లు అత్యధిక బేస్ ధరను కలిగి ఉన్న ముగ్గురు భారతీయ ఆటగాళ్లు. ఈసారి ఈ ముగ్గురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు విడుదల జాబితాలో ఉంచాయి. వీరు కాకుండా 20 మంది విదేశీ ఆటగాళ్లు తమ బేస్ ధరను రూ.2 కోట్లుగా ఉంచారు. వీరిలో 7 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు చెందిన వారు కాగా, 7 మంది ఆటగాళ్లు ఇంగ్లండ్కు చెందినవారు ఉన్నారు. ట్రావిస్ హెడ్, హ్యారీ బ్రూక్, రిలీ రోసౌవ్, స్టీవ్ స్మిత్, గెరాల్డ్ కోయెట్జీ, పాట్ కమిన్స్, క్రిస్ వోక్స్, జోష్ ఇంగ్లిస్, లాకీ ఫెర్గూసన్, జోష్ హేజిల్వుడ్, మిచెల్ స్టార్క్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఆదిల్ రషీద్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, అబ్బోట్, జామీ ఓవర్టన్, డేవిడ్ విల్లీ, బెన్ డుకైట్, ముస్తాఫిజుర్ రెహమాన్ పేర్లు ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
బేస్ ధర రూ. 1.5 కోట్లు ఉన్న విదేశీ ఆటగాళ్లు
బేస్ ధర రూ. 1.5 కోట్లు ఉన్న ఆటగాళ్లలో వనిందు హసరంగా, ఫిలిప్ సాల్ట్, కోలిన్ మున్రో, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, టామ్ కర్రాన్, జాసన్ హోల్డర్, మహ్మద్ నబీ, జేమ్స్ నీషమ్, డేనియల్ సెమ్స్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, ఝీ రిచర్డ్సన్, టిమ్ సౌథీ పేర్లు ఉన్నాయి.
ఈ ఐపీఎల్ వేలం డిసెంబర్ 19న దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక్కడ ఐపీఎల్లోని మొత్తం 10 ఫ్రాంచైజీలు రూ.262.95 కోట్లతో వేలం హాలుకు రానున్నాయి. ఈ మొత్తంతో గరిష్టంగా 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. విదేశీ ఆటగాళ్ల గరిష్ట సంఖ్య 30 మంది ఉండవచ్చు. కోల్కతా నైట్ రైడర్స్లో అత్యధికంగా (12) స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అదే సమయంలో అత్యధిక మొత్తం (38.15 కోట్లు) గుజరాత్ టైటాన్స్ పర్స్లో మిగిలిపోయింది.
Related News
IPL 2024 : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..ఉప్పల్ లో మ్యాచ్ జరిగేనా..?
ప్రస్తుతం ఉన్న సమీకరణాల దృష్ట్యా సన్రైజర్స్ ప్లేఆఫ్స్లో అడుగుపెట్టాలంటే..ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలువాల్సి ఉంది. గుజరాత్పై ఓడినా హైదరాబాద్కు ప్లేఆఫ్స్కు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. కానీ వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి.. టాప్-2లో చోటు దక్కించుకోవాలని కమిన్స్ సేన చూస్తోంది