World Cup 2023 Tickets: వరల్డ్ కప్ 2023కి సంబంధించిన మ్యాచ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా.. టికెట్ ధర రూ. 10,000 వరకు ఉండే ఛాన్స్..?
అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, చివరిసారిగా ఫైనలిస్టులైన ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. ఇప్పటి వరకు మ్యాచ్ల టిక్కెట్ల (World Cup 2023 Tickets) విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు.
- By Gopichand Published Date - 01:10 PM, Fri - 7 July 23
World Cup 2023 Tickets: ప్రపంచకప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. ప్రపంచకప్ షెడ్యూల్ను జూన్ 27న ఐసీసీ విడుదల చేసింది. 10 జట్లతో జరిగే ఈ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్లు జరగనున్నాయి. అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, చివరిసారిగా ఫైనలిస్టులైన ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. ఇప్పటి వరకు మ్యాచ్ల టిక్కెట్ల (World Cup 2023 Tickets) విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రపంచకప్కు టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే ఈ మెగా టోర్నీకి సంబంధించిన టిక్కెట్లు ఇంకా విడుదల కాలేదు. ‘ఎకనామిక్ టైమ్స్’ కథనం ప్రకారం.. ప్రపంచకప్ టిక్కెట్లు త్వరలో విడుదల కానున్నాయి. చాలా వరకు టిక్కెట్లు ఆన్లైన్లో మాత్రమే వస్తాయి. ICC అధికారిక వెబ్సైట్లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా బుక్మైషో, పేటీఎం, పేటీఎం ఇన్సైడర్లలో కూడా టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
నివేదికల ప్రకారం.. టికెట్ ధర రూ. 500 నుండి రూ. 10,000 వరకు ఉండవచ్చు. వేదికను బట్టి టిక్కెట్ల ధరను నిర్ణయించవచ్చు. ప్రపంచకప్లోని అన్ని మ్యాచ్లు మొత్తం 10 వేదికల్లో జరుగుతాయి. అక్టోబర్ 15న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఇండో-పాక్ మ్యాచ్పై అభిమానులు మరింత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మ్యాచ్కి టిక్కెట్లు ఏ ధరకు లభిస్తాయన్నది ఆసక్తికరం. టికెట్ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అక్టోబర్ 8న టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది
ప్రపంచకప్లో భారత జట్టు తన తొలి మ్యాచ్ను అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడనుంది. దీని తర్వాత అక్టోబర్ 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్తో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 15న నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.
Related News
India vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. సోషల్ మీడియాలో ప్రోమో వీడియో వైరల్..!
T20 వరల్డ్ కప్ 2024.. IPL 2024 ఫైనల్ తర్వాత ప్రారంభమవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నీ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది.