Neeraj Chopra: లౌసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా..!
నీరజ్ చోప్రా ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. అతను శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉంది. అయితే ఇది ఉన్నప్పటికీ అతను ఈ లీగ్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు.
- By Gopichand Published Date - 08:26 AM, Fri - 23 August 24

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు రజత పతకాన్ని అందించిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఇప్పుడు కొత్త స్టైల్లో కనిపిస్తున్నాడు. నీరజ్ లౌసాన్ డైమండ్ లీగ్-2024లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్లోకి ప్రవేశించాడు. ఈ టోర్నీలో నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ 2024లో తన రికార్డును బద్దలు కొట్టాడు. పారిస్ ఒలింపిక్స్లో జావెలిన్ని 89.45 మీటర్లు విసిరి రజత పతకం సాధించగా.. లౌసాన్ డైమండ్ లీగ్లో మాత్రం 89.49 మీటర్లు విసిరి అద్భుతంగా త్రో చేసి రెండో స్థానంలో నిలిచాడు.
ఒలింపిక్ రికార్డు బద్దలైంది
పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా ఈ సీజన్లో తన దూరమైన త్రోను చేశాడు. ఈ ఒలింపిక్స్లో అతను 89.45 మీటర్లు విసిరాడు. లౌసాన్ డైమండ్ లీగ్లో అతను ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సీజన్లో తన అత్యుత్తమ త్రో 89.49 మీటర్లు చేశాడు. ఏది ఏమైనప్పటికీ నీరజ్ చోప్రా కెరీర్లో అత్యుత్తమ త్రో 89.94.
Also Read: Ronaldo: యూట్యూబ్లోకి ఎంట్రీ ఇచ్చిన రోనాల్డో.. తొలిరోజే ఎంత సంపాదించాడో తెలుసా..?
చివరి ప్రయత్నంలో విజయం
నీరజ్ చోప్రా ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. అతను శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉంది. అయితే ఇది ఉన్నప్పటికీ అతను ఈ లీగ్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. గాయం ప్రభావం అతనిపై కూడా కనిపించింది. నీరజ్ చోప్రా క్వాలిఫైయింగ్ రౌండ్లో 4 ప్రయత్నాల్లో నాలుగో స్థానంలో నిలిచాడు. 5వ త్రోలో మూడో స్థానంలో నిలవగా.. చివరి త్రోలో రెండో స్థానంలో నిలిచాడు. నీరజ్ చివరి త్రోను 89.49 మీటర్లు విసిరాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ దిగ్గజం మొదటి స్థానంలో నిలిచాడు
పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతకం సాధించిన గ్రెనడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ ఈ రౌండ్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అండర్సన్ పీటర్స్ కూడా చివరి ప్రయత్నంలో 90.61 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచి ఫైనల్కు టికెట్ దక్కించుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్లో అండర్సన్ పీటర్స్ 88.54 మీటర్లు విసిరాడు. నీరజ్ చోప్రా 89.49 మీటర్లు విసిరి రెండో స్థానంలో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 87.08 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచారు.